Home » Sircilla
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. సోమవారం అడ్దగుంటపల్లిలోని ఒక ఫంక్షన్హాల్లో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఓటరు జాబితా ముసాయిదా పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాలను ఈనెల 9వ తేదీ వరకు అధికారులు స్వీకరించనున్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, మారుపేర్ల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఉదయం జీడీకే 11ఇంక్లైన్ను ఆయన సందర్శించి అండర్ గ్రౌండ్లోని పని స్థలాలను పరిశీలించారు.
మండలం లోని హన్మంతునిపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మల గద్దెల వరకు బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణా లతో నిర్మించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.
జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలోని పల్లవి పాఠశాలలో జిల్లాస్థాయి ఖోఖో ఎంపిక పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలింపిక్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియో జకవర్గ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలతో తనకెలాంటి విభేదాలు లేవని, రెండేళ్ల పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4500కోట్లు మంజూరు చేయించానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడేళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్వోబీకి ఇరువైపులా ఉన్న రోడ్డు నిర్మాణం కోసం సేకరించాల్సిన భూమి విషయంలో సయోధ్య కుదరకపోవ డంతో ఆర్అండ్ పనులు నిలిచిపోయాయి.
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన ఓటర్ల ఓట్లు వారు నివాసం ఉండే వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు మారాయి. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదిహేను వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించి నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ ద్వారా రూ.35.19 కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద స్థానిక హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.