Home » Sircilla
మొంథా తుఫాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టం అంచనా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్ నాయకులు మీస అర్జున్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు.
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలె క్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, అరుణ శ్రీలతో కలిసి సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి నివాళు లర్పించారు.
జిల్లాలో పని చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్ ముగిసినప్పటికీ, సర్వీస్ క్రమబద్ధీకరణ కాకపోవడంతో వారు ఇంక్రి మెంట్లు, ఇతర ప్రయోజనాలు కోల్పోతున్నారు.
పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించవద్దని రైతులు బుధవారం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్నారు. పోతారం-కేశనపల్లి వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అధికారులు సందర్శించిన క్రమంలో రైతులు అడ్డుకుని నష్టపరిహారం చెల్లించే వరకు పనులు ప్రారంభించేది లేదన్నారు.
ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు కార్మి కులు ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట బైఠా యించి ప్ల కార్డులతో నిరసన తెలిపారు.
విద్యార్థుల ఫీజు బకా యిలను విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని బీఆర్ఎస్వీ నాయకులు ముట్టడించారు.
పత్తి కొనుగోళ్లలో అక్ర మాలకు చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయా ధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు.
పోలీసు అమరవీరుల అజరామరమని ప్రతీ ఒక్కరు వారి సేవలను స్మరించుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి మండలాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని మార్కెట్ చైర్మన్ వైనాల రాజు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీఎంఓ ప్రవీణ్రెడ్డి అన్నారు.
మహిళలు స్వయం ఉపాధిలో ముందుం డాలని విశ్వహిందు పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్ముళ్ల సత్యంజీ అన్నారు. మంగళ వారం శారదానగర్లోని విశ్వహిందు పరిషత్ భవన్లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.