Home » Sircilla
సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చాడవెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
చామనపల్లి సర్పంచ్ వేల్పుల రేవతి ఆధ్యర్యంలో విద్యుత్ అధికారులు శనివారం ప్రజాబాట నిర్వహించారు. అధికారులు డీసీహెచ్ రాజాబ్రహ్మచారి, ఏడీ ఠాగూర్ విజయగోపాల్సింగ్ సమస్యలు తెలుసుకున్నారు.
రామ గుండంలో ఆదివారం ముగ్గురు మంత్రులు పర్య టించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పరి శ్రమల, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మం త్రి శ్రీధర్బాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హాజరు కానున్నారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వేగం పెంచుతామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పట్టణంలోని 11, 13, 14, 15 వార్డుల్లో శనివారం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి, భూమి పూజ చేశారు.
కరీంనగర్ జిల్లాకు ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఇటీవలి కాలంలో ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
ఎన్నికలు ఏవైనా సోషల్ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఎన్నికల నిర్వహణ కోసం కీలకమైన ఓటర్ జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తుండగా, రిజర్వేషన్లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వక పోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అధికారులను ఆదేశించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం 13, 14, 32, 33వ వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 633 డబుల్ బెడ్రూమ్లను ఈ నెల 11న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మంత్రుల పర్యటన ఏర్పాట్లపై పరిశీలించారు.