Home » Sircilla
రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ఆరోపించారు.
బడుగు, బలహీన వర్గాలంతా ఓటు హక్కుతోనే అందరితో సమానంగా గౌరవించబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సర్ ప్రోగాంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్నగర్లో ఓటర్లకు ఓటు హక్కు పై పుట్ట మధు ఆదివారం అవగాహన కల్పించారు.
యువతలో మార్పు రావాలంటే తల్లిదండ్రుల కృషి అవసరమని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి నాయక్ అన్నారు. ఆదివారం రాత్రి కొత్తపల్లిలో ఎస్ఐ ప్రవీణ్కుమార్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గంజాయి - మత్తు పదార్ధాల నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
కరీంనగర్కు చెందిన ఒక యువకుడు తన ఇంటిలోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం ద్వారా సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలో అతని బ్యాంక్ ఖాతా నుంచి 98 వేల రూపాయలు సంతోష్కుమార్ బహేలి అనే గుర్తుతెలియని వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు బాధితుడికి బ్యాంక్ నుంచి మెస్సేజ్ వచ్చింది. అయితే తాను ఎలాంటి లింక్లు, మెస్సేజ్లు ఓపెన చేలేదని, బ్యాంక్ లావాదేవీలు కూడా జరపలేదని బాధితుడు పోలీసులకు తెలిపాడు.
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ(కేవీ) స్థల కేటాయింపు వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జీ భోగ శ్రావణిప్రవీణ్ల మధ్య జరిగిన పట్టు సడలింపుల ఫలితంగా, ప్రభుత్వం ఇటీవల చల్గల్ గ్రామంలో 5ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో వివాదం కొంతమేర సమసిపోయినట్లయింది.
పిల్లలు బడికి వెళ్లడానికి రెడీ అయినా క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు. మరికొందరు అకస్మాత్తుగా వచ్చిన నొప్పిని చూసి గాభరాపడుతారు.
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. గోదావరిఖని బస్టాండ్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపడంతోపాటు భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మాతా శిశువు ఆసుపత్రిలో వెద్యులను నియమించాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ హెచ్చరించారు.
పెద్దపల్లి పట్టణం ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. పట్టణం ప్రారంభం రంగంపల్లి నుంచి మంథని ఫ్లైవోవర్ వరకు ప్రయాణించడం గగనంగా మారింది. పలు యూటర్న్లు, సిగ్నల్స్ ఉన్నప్పటికీ రాజీవ్ రహదారి పట్టణం నుంచే ఉండడంతో గందరగోళంగా తయారైంది