Home » Sircilla
పదేళ్లుగా బకాయిలు చెల్లిం చకుండా ఆర్టీసీ యాజమాన్యం వేధిస్తుందని, తమకు చావే దిక్కని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నాగేందర్, వెంగళ కనకయ్య అన్నారు. బకాయిలు చెల్లించాలంటూ శనివారం గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు.
ఎన్ని కల సందర్భంలో తాము ఇచ్చిన హామీ లన్నింటినీ నెరువేరుస్తామని, గత పాలకుల మాదిరిగా మోసం చేసే వాళ్లం కాదని ఎమ్మెల్యే చింత కుంట విజయరమ ణారావు అన్నారు.
రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అభివృద్ధికి తాను ఎల్లవే ళలా కృషి చేస్తున్నానని, ఓర్వలేని వారు చేస్తున్న విమర్శ లకు అభివృద్ధితోనే జవాబు చెబుదామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో రూ.20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రారం భించారు.
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వార్డుల సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు సైతం మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవటానికి రాజకీయ వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వశాఖల మధ్య సమన్వ యంతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల ప్రాణ రక్షణే ఉద్దేశ్యంగా చేపట్టిన అరైవ్... అలైవ్... కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఐటీఐ మైదానంలో వాకర్స్ ట్రాక్, స్విమ్మింగ్ఫూల్, బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి సీసీ రోడ్డు, డైన్రేజీలు మహిళా పోలీస్స్టేషన్లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ సుమారు 4 కోట్ల 59 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. రిజర్వే షన్లపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ను హైద రాబాదులోని సీడీఎంఏ ఆఫీసులో, పెద్దపల్లిలోని కలె క్టరేట్లో ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా వార్డుల కేటాయింపు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు డ్రా నిర్వహించనున్నారు.
సింగరేణి సంస్థ లక్షలాది మంది ప్రజలకు తిండి పెడుతుందని, మున్సి పల్ కార్పొరేషన్కు సింగరేణి పేరును వాడుకలోకి తీసు కురావాలని ప్రతిపాదిస్తున్నట్టు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి మూలాధారమైన సింగ రేణిని స్మరించుకునేలా అందరూ ఆమోదిస్తే పేరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
బుధవారం గోదా రంగనాథుల స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు ఆధ్వర్యంలో నిర్వ హించిన కల్యాణంలో దంపతులు కన్యాదాతలు గా వ్యవహరించారు.
హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దులతో విన్యాసాలు.. చిన్నారులు కోలాటాలు, మహిళల రంగవల్లు లతో సందడి నెలకొంది. సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్లో నిర్వహిం చిన భోగి సంబరాలు అంబరాన్నంటాయి.