Home » Sircilla
చెరువుల్లో పూడికతీత, ఆధునికీకరణ పనుల పేరిట తీసిన మట్టిని రైతుల పొలాల పేరు చొప్పుకొని కొందరు భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. చెరువుల్లో ఎక్స్కవేటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి అర్థరాత్రి వరకు వందలాది ట్రాక్టర్లతో మట్టిని ఇటుక బట్టిలు, వెంచర్లు, ప్రైవేట్ ఇంటి నిర్మాణస్థలాలు, ఇతర కమర్షియల్ పనులకు తరలించి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
గాలి వాన బీభత్సం వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ ఆదుకుంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. ధర్మారం మండలంలో ఆదివారం గాలివానతో దెబ్బతిన్న పలు ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. బాధితులు బాధపడవద్దని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని చెప్పారు.
త్వరలో రాష్ట్రంలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో నిర్మాణాలు పూర్తి చేసు కున్న ఇందిరమ్మ ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాకు మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు సమస్య పరిష్కారం కావడం లేదు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించే వ్యవహారంలో బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ల మద్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.
దేశ అభివృద్ధిలో పల్లెలే కీలకపాత్ర పోషిస్తాయి. అనేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోక వెక్కిరిస్తున్నాయి. కనీస అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నిధుల కోసం ఎదురు చూస్తుంటారు. గ్రామాలకు ప్రధాన వనరుగా ఆర్థిక సంఘం నిధులే ఊరట కలిగిస్తాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పల్లెలకు ఆర్థిక భరోసా కలుగుతుందని భావిస్తున్నారు.
ఉన్నత విద్యాభ్యాసానికి టర్నింగ్ పాయింట్ అయిన ఇంటర్మీడియెట్ విద్యలో మారుతున్న కాలానికి అనుగు ణంగా సమూల మార్పులు తీసుక వచ్చేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేసింది. కొన్నేళ్ళుగా అమల్లో ఉన్న పాత విధానాలకు స్వస్తి పలికింది. విద్యార్థుల్లో పఠనా సక్తి, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెం చేలా ఇంటర్ సిలబస్లో మార్పులు తీసుకువచ్చింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎన్టీపీసీ డిప్యూటీడీజీఎం (హెచ్ఆర్) ప్రవీణ్ చౌదరి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం నాగభూషణం పిలుపుని చ్చారు. గురువారం ఆర్టీసీ, ఎన్టీపీసీ అధికారులు సంయుక్తంగా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ఆవరణలో మొక్కలను నాటారు.
వానాకాలంలో ఓసీపీలో ఉత్పత్తికి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సింగ రేణి సంస్థ చైర్మన్అండ్మేనేజింగ్ డైరెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అన్నారు. గురువారం ఆర్జీ-2 ఏరియాలో పర్యటించారు. ఓసీపీ-3 సీహెచ్పీ ఆధునికీకరణ పనులను పరిశీలించారు.