Home » Sircilla
నిరుపేదలందరికి విడుతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లు పనులు ప్రారంభించి ప్రొసిడింగ్లు అందజేసిన అనం తరం మాట్లాడారు.
గోదావరిఖని సమ్మక్క - సారలమ్మ జాతర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కా న్సింగ్ రాజ్ఠాకూర్ అధికారులకు సూచించారు. మంగళవారం జాతర ప్రాంగణంలో ఆర్జీ-1 జీఎం లలిత్కుమార్తో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంథని బస్టాండ్లలో ప్రత్యేకించి జాతర క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 410 బస్సులను మేడారం నడపనున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై రోజుకో రకంగా ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ వస్తోందని ఒకసారి, ఫిబ్రవరిలో పోలింగ్ ఉంటుందని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్, పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కాయి.
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్,వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో సిరిసిల్ల, వేములవాడలో రాజకీయ సందడి మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పెద్దలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో తలమునకలవుతున్నారు.
పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో సర్పంచ్లు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జిల్లాలో పది మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు.
స్వయం ఉపాధి చేసుకుంటూ జీవించే మహిళలకు ఇచ్చే స్త్రీనిధి రుణాల పంపిణీ, చెల్లింపుల విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్పడింది. రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్ ద్వారానే డబ్బులు చెల్లించేం దుకు ప్రభుత్వం తీసుకవచ్చిన ‘మన స్త్రీ నిఽధి యాప్’ గురించి డీఆర్డీవో అధికారులు, సిబ్బంది, స్త్రీ నిధి బ్యాంకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
మండ లంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మండలంలో పర్యటించి ఎంపి డిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
సర్పంచ్లు ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దబొం కూర్లోని మదర్థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మంలో కలెక్టర్ పాల్గొన్నారు.