Home » Sircilla
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని మాతాశిశు కేంద్రంలో మెరుగైన వైద్యసేవలందించిన సిబ్బందిని సన్మానించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఐదు దశాబ్దాలుగా దేశానికి వెలుగులను అందిస్తూ ప్రపంచ అగ్రగామి సంస్థగా ఎన్టీపీసీ వెలుగొందుతోందని రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
రామగుండంలో అధికారులు అత్యు త్సాహంతో రోడ్ల పక్కన ఉన్న నిర్మాణాలను కూలగొట్టారని, దీనికి అధికార యంత్రాంగానిదే బాధ్యతని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో నాయకులు మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో దారి మైసమ్మల గుళ్లను కూల్చి వేయడంపై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖని చౌరస్తాలోని పోచమ్మ గుడి వద్ద సమావేశమై చర్చించారు.
ప్రభు త్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ పని తీరుపై సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నెలలో 263 ప్రసవాలు జరిగాయని, ప్రసవాల సంఖ్య పెరగడంపై వైద్యులను అభినందించారు.
ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్ప రుచుకొని ఏకాగ్రతతో చదివితే గమ్యం చేరుకోవడం సులభమవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గురువా రం జూనియర్ కళాశాలలో సైబర్ క్రైంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రహదారుల డివైడర్లు, రోడ్ల పక్కన కూడళ్ల ప్రాంతాల్లో గ్రామ దేవతలను పూజించేందుకు నిర్మించిన కట్టడాలను రామగుండం నగర పాలక యంత్రాంగం గురువారం తెల్లవారుజామున కూల్చివేసింది.
సింగరేణి యాజమాన్యం ఇటీవల 150మస్టర్లు ఉంటేనే రెగ్యులరైజేషన్ చేస్తామని తీసుకువచ్చిన సర్క్యూలర్ను వెనక్కి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబరు 23న యాజమాన్యం విడుదల చేసిన సర్క్యూలర్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మంత్రి శ్రీధర్బాబు క్యాంపు ఆఫీసు ఎదుట ఎస్ఎఫ్ఐ శ్రేణులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి రైల్వే జంక్షన్తోపాటు బైపాస్ స్టేషన్ను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ సందర్శించారు. స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు.