Home » Sircilla
ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తా నాబాద్ మున్సిపాలిటీ పరిధి ఏడవ వార్డు యాదవనగర్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న బస్తీ దవాఖానా పనులకు సోమవారం భూమి పూజచేసి ప్రారంభించారు.
పోరాటాల ప్రతిధ్వనిగా పేరు గాంచిన అరుణోదయ నాగన్న స్వరం మూగబోవడం బాధాకరమని సీపీఐ ఎంఎల్ న్యూడెమో క్రసి కేంద్ర కమిటీ నాయకులు చలపతిరావు పేర్కొ న్నారు. ఆదివారం ఎన్టీసీపీ జ్యోతినగర్లోని ఐఎఫ్టీ యూ కార్యాలయం వద్ద కామ్రేడ్ నాగన్న సంతాప సభను నిర్వహించారు.
బహుజానులంతా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్లాల్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 80 శాతం పైగా ఉన్న బహుజన వర్గాలకు రిజర్వేషన్లు సరిగా అందకుండా పాలకులు చేస్తున్నారన్నారు.
మంథనిలో న్యాక్ సెంటర్ను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్బాబు ప్రజలకు చెప్పా లని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ మార్చి నెలలోనే న్యాక్ సెంటర్ తీసుకువచ్చారన్నారు.
సుల్తానాబాద్ పట్టణంలోని గొల్లపల్లి ప్రాంతంలో లక్క పురుగుల బెడద తీవ్రంగా ఉంది. ప్రజలు లక్క పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి మూలంగా ఇండ్లలో ఉండలేని దుస్థితి నెలకొందని, ఆహార పదార్థాల్లో పడడంతో తినలేని పరిస్థితి ఉందని గొల్లపల్లి యాదవనగర్ వాసులు అవేదన వ్యక్తం చేస్తు న్నారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశాలున్నాయి.. ఇందుకోసం పేద ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో మాత్రం సిరంజీలు, మందుల కొరత ఏర్పడింది. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సిరంజీల సరఫరా నిలిచిపోయింది.
ఈ యేడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థుల మాదిరిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉదయాన్నే కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పాఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని నిర్ణయించింది.
సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంపై ఆశలు రేకెత్తుతున్నారు. గతంలో దేవస్థానం పునర్నిర్మా ణానికి టీటీడీ మంజూరు చేసిన నిధులతో పనులు చేపట్టడానికి భూమి పూజ చేశారు. మూడేళ్లుగా నిర్మాణ పనుల్లో కదలిక లేకపోవడంతో శ్రీస్వామివారి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న వేళ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పాలకవర్గం దేవస్థానం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి నిర్ణయించింది.
గ్రామ పంచాయతీల సొంత నిధుల వాడకంపై ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి పంచాయతీల కుస్వయం ప్రతిపత్తిని కల్పించడంతో సర్పంచులు, వార్డు సభ్యులు, పం చాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, తల్లిదండ్రులు తప్పనిసరిగా భాగస్వా ములు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం తుర్కల మద్దికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.