Home » Sircilla
ఆరోగ్యకరమైన జీవనం కోసం హ్యాపీ సండే కార్యక్రమం అవసరమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు డిజిటల్ స్ర్కీన్స్కు అలవాటు పడి శారీరక, మానసిక సామర్ధ్యాన్ని కోల్పోతున్నారన్నారు.
గ్రానైట్ అక్రమాలపై కేంద్రం దృష్టిసారించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానికంగా ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ అక్రమ దందాలు, వేల కోట్ల స్వాహా అంటూ వచ్చిన ఫిర్యాదుల ఫైళ్ల గుట్టు విప్పేందుకు సిద్ధమైంది.
జిల్లాలో ఇప్పటికే పౌరసరఫరాల శాఖ యాసంగిలో ధాన్యం కొనుగోలు అంచనా దాటి సేకరిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి 4 లక్షల 56 వేల 664 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3 లక్షల 3,940 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం కొనసాగనుంది.
జిల్లాలో గల మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ప్రభుత్వం విద్యా ర్థులకు సరిపడా మెస్ చార్జీలను పెంచినప్పటికీ పౌష్టికాహారం లభించడం లేదు. కూరగాయలు, చికెన్, మటన్, కోడిగుడ్లు సర ఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత లేని, నాసిరకం సరుకులను సర ఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సమిష్టి కృషితో రామగుంగం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మేయర్ మహంకాళిస్వామి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఎన్సీఓఏ క్లబ్లో కాలనీలోని ఏడు డివిజన్లలో వార్డు సభ జరిగింది.
ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం.విన య్నాయక్ అన్నారు. శనివారం పారుపల్లి గ్రామ పరిధిలో మైదంబండ బీట్, బేగంపేట సెక్షన్లో ఉన్న పారుపల్లి పెద్ద చెరువు వద్ద బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దబొంకూర్లో రాజేశం అనే రైతు అయిల్పామ్ సాగు చేయగా క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖ అధికారులు సందర్శించారు.
నేరస్థులకు శిక్ష పడడంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలక మని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం కమి షనరేట్లో కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సింగరేణిలో అవినీతి, కుంభకో ణాలకు కారణం బీఆర్ఎస్సేనని రామగుండం నగర మేయర్ మహం కాళి స్వామి బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లు సింగరేణిని దోచుకున్న కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు దద్దమ్మల్లాగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ హఠావో అనే నినాదంతోనే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందపెట్టి కాంగ్రెస్ను కార్మికులే అధికారంలోకి తీసుకువచ్చాన్నారు.
పెద్దపల్లి నియోజక వర్గ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి సం బంధిత రైస్మిల్లులకు తర లించేందుకు చర్యలు చేప ట్టామని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే చింతకుంట విజయరమ ణారావు తెలిపారు.