Home » Shubman Gill
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు విజృంభించారు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో.. తక్కువ స్కోరుకే గుజరాత్ జట్టు పేకమేడలా కూలింది.
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్గా అవతరించాడు.
కెప్టెన్ శుభ్మన్ గిల్ విధ్వంసానికి తోడు రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగిన గిల్(89) అజేయ హాఫ్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్లో రెండు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షోతో సన్రైజర్స్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఐపీఎల్ నిర్వహకులు షాకిచ్చారు. అసలే చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిన బాధలో గిల్ ఉన్నాడు. ఇలాంటి సమయంలో గిల్కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.
చెన్నైసూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ధర్మశాలలో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు, శుభ్మన్ గిల్కు మధ్య మాటల యుద్ధం సాగింది.