Home » Seethakka
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.. భారీ వర్షాలకు కామారెడ్డిలో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద పరిశీలనకు వస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ గురించి మాట్లాడినట్లు గుర్తు చేశారు.
కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని, ఈ మేరకు మహాజాతరను నిర్వహించనున్నట్లు మంత్రులు మంత్రి కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
కవిత ఎపిసోడ్ కుటుంబ రాజకీయ డ్రామా అంటూ మంత్రి సీతక్క కొట్టిపారేశారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్.. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోపెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని బలహీన పరిస్థితికి చేరుకున్నారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ట్రైబల్ డిజైన్ ప్లాన్లతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు రూపకల్పన చేసినట్లు మంత్రి దనసరి సీతక్క తెలిపారు.
భారీ వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు దామోదరరాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు.
జువెనైల్ హోంలు పరివర్తన కేంద్రాలని, ఇక్కడ ఉండే బాలలు సత్ప్రవర్తనతో బయటకు వెళ్లి ఉన్నత పౌరులుగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్శాఖ పరిధిలోని గ్రామీణ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అక్షరాలతో రచించలేనిది… మాటలతో నిర్వచించలేనిది… సీతక్కతో నా అనుబంధం… ప్రతి రాఖీ పౌర్ణమి నాడు ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుంది అంటూ సీతక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు సీఎం రేవంత్.
ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం, ఆదివాసీలకు జరుగుతున్న మంచి చెడులను చర్చించుకునేందుకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఒక మంచి వేదిక మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి గొప్పతనం, మూలాలు, సంస్కృతి జీవన విధానాలను ఎప్పుడు మర్చిపోకుండా కాపాడుకోవాలి ఆమె సూచించారు.