Home » Sankranthi festival
సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు పల్లె బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ ఊర్లకు పయనమయ్యారు.
సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
సంక్రాంతి సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనక ప్రత్యేక నమ్మకం, చరిత్ర ఉంటాయి. వీటితో పాటు గాలిపటాలు ఎగురవేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. చిన్నా, పెద్దా తేడా మరిచిపోయి ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు. అయితే ఇలా గాలిపటాలు ఎగురేసేందుకు కారణాలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా?
మకర సంక్రాంతిని దేశంలోని అనేక రాష్ట్రాలలో జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రంలోనూ మకర సంక్రాంతిని వివిధ పేర్లతో పిలుస్తూ, వివిధ సంప్రదాయాల్లో పలు రకాలుగా జరుపుకుంటారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
CM Chandrababu Naidu: ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధిగా ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉందని అన్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. రద్దీ నియంత్రించటానికి కలెక్టర్లతో మాట్లాడతానని అన్నారు.
Sankranti Festival: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం టీఎస్సార్టీసీ ప్రత్యేకంగా 6432 బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్పీనగర్, ఆరంఘార్ బస్స్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని జిల్లాలకు 1600 వందల బస్సులు, ఏపీ వైపు 300 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళిక చేశారు.
Sankranti holidays: సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు పండుగ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
కొందరి సరదా మరికొందరికి గాయాలు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పంతగులకు వాడుతున్న చైనా మాంజా. పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా(China manja)ను అధికారులు నిషేధించారు.
సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా పండుగ హడావుడి మామూలుగా లేదు. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్.
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.