Home » Sankranthi festival
తెలుగు ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలకు సర్వైశ్వర్యం, సమృద్ధి, శుభమంగళాలను ప్రసాదించాలని డిప్యూటీ సీఎం కోరారు.
ఏపీలో కోడి పందేలు హోరాహోరీగా సాగుతున్నాయి. పందేల్లో భాగంగా లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. కోడిపందేలను వీక్షించేందుకు పెద్దఎత్తున జనం తరలివస్తున్నారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మకర సంక్రాంతి సౌర చక్రం ఆధారంగా ఉంటుంది. అందువల్ల, ఇది దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం తేదీ మారింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమంచి 20 వేల ఆవు పిడకలతో 1000 అడుగుల భారీ భోగి మాలను రూపొందించారు.
గతంలో గంగిరెద్దుల ఆటలకు గ్రామాల్లో ఆదరణ ఉండేది. అయితే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో... గ్రామాల్లో గంగిరెద్దుల ఆటలకు ఆదరణ కరువైపోచింది. ప్రస్తుతం ఎక్కడో ఒకచోట ఈ గంగిరెద్దుల వారు దర్శనమిస్తున్నారు. ప్రధానంగా సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దుల విన్యాసాలు కనబడేవి.
భోగి పండుగ అంటే భోగి మంటలతో పాటు చిన్నారులపై భోగి పండ్లు పోసే ముచ్చటైన దృశ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది.. భోగి పండ్లు పోసే విధానం, నియమాలు, వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు.
పుడమి తల్లిని నమ్ముకున్న పల్లెవాసుల సంతృప్తి, ఆనందాలకు ప్రతీక సంక్రాంతి. ధనుర్మాసంలో స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్రతం ఆచరించి యశోదా తనయునికి బాల భోగం సమర్పించి హారతి ఇస్తారు. యువతులు నెల రోజులు ముంగిట్లో కళ్లాపి చల్లి రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముగ్గులపై గొబ్బెమ్మలను ఉంచి బంతి, చామంతి, తంగేడు, గుమ్మడి పూలతో అలంకరించి పసుపు కుంకుమతో పూజిస్తారు. సంక్రాంతి అంటేనే సంప్రదాయాల పండుగ కావడంతో.. ప్రత్యేక వంటలు రుచితో పాటు మంచి ఆరోగ్యాన్నీ ఇస్తాయి.
సంక్రాంతి పండగ శోభతో అటు పల్లెలు.. ఇటు పట్టణాలు కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. నేడు భోగి సందర్భంగా.. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు.. పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరినా సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది.
సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ ముందే వచ్చేంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి.