Home » Sankranthi festival
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా సాగాయి. మంగళ, బుధవారాల్లో ప్రజలు పెద్దఎత్తున సంక్రాంతి, కనుమ వేడుకలను జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులను వేసి, గొబ్బెమ్మల ను ఏర్పాటు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించారు. ఆలయాల్లోనూ మకర సంక్రమణ పూజలు, కనుమనాడు గోపూజ నిర్వహించారు. టీటీడీ హిం దూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం తలుపూరు లోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం గోపూజ చేశారు.
సంక్రాంతికి పండుగకు ఊరికి పోతున్నాం.. మా ఇంటికి రాకండి అంటూ దొంగల కోసం ఇంటి గేటుకు నోట్ అంటించి మరీ ఊరికెళ్లిన ఓ ఇంటి యజమాని. .
Makar Sankranti 2025: సంక్రాంతి అనగానే ముగ్గులు, పతంగులు, పిండి వంటలు, హరిదాసులు, బసవన్నే అందరికీ గుర్తుకొస్తారు. అయితే చాలా మందికి హరిదాసుల గురించి తెలియదు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం..
Makar Sankranti 2025: తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ వచ్చేసింది. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, చుట్టాల సందడి, ముగ్గుల హోరు, పతంగుల జోరుతో పండుగ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవల్కు చేరుకోనుంది.
అహ్మదాబాద్లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో అమిత్షా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఆయన వెంటే ఉన్నారు.
Sankranti CelebrationS 2025: భాగ్యనగరంలో సంకాంత్రి వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కైట్ ఫెస్టివల్ను భోగి పండుగ రోజు ప్రారంభించారు. మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరుగనుంది.
భారతదేశంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో మకర సంక్రాంతి ప్రధానమైనది. ఆసేతు హిమాచలం ఒక్కో రాష్ట్రం వారు ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారికైతే మరీ ప్రత్యేకం. అయితే, సంక్రాంతి ఇతర పండగల మాదిరిగా కాకుండా ప్రతి ఏడాదిలో ఒకే సమయంలో ఎందుకు వస్తుందో తెలుసా.. అందుకు కారణమిదే..
పంతగుల పండగ సమయంలో నిషేధిత చైనా మాంజా(Chinese manja) వినియోగించడం వల్ల మనుషులు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పు కలుగుతోందని అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు(DCP Ande Srinivasa Rao) తెలిపారు.
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్(International Kite Festival)లో సందర్శకులు విదేశీ కైట్లను తిలకిస్తూ ఆనందంగా గడపగా.. స్వదేశానికి చెందిన హైదరాబాద్ వాసి అశోక్కుమార్ తయారు చేసిన స్వదేశీ పతంగి విదేశీ కైట్ ప్లేయర్లను ప్రత్యకంగా ఆకర్షించింది.
Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.