Home » Sachin Tendulkar
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరో చెప్పేశాడు. ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న రహానె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
క్రికెట్కు వీడ్కోలు పలికి 13 ఏళ్ల గడిచినా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్-2025 నివేదిక ప్రకారం సచిన్ బ్రాండ్ విలువ125.9 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1,189 కోట్లు)గా నమోదైంది.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్, కింగ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో చాలా చురుకుదనం ఉంటూ, కఠినమైన శిక్షణతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి రెండేళ్ల ముందే అతడు పాకిస్థాన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిన విషయం చాలా మందికి తెలియదు.
అజింక్య రహానె రిటైర్మెంట్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్లో మూడు తరాల స్టార్ ప్లేయర్లను ఒకే ఫ్రేమ్లో చూపిస్తూ వింబుల్డన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్మన్ గిల్ వింబుల్డన్ వీక్షించిన ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది.
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఓ కీలక ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత కూడా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్లైన్స్ను రూపొందించింది. ఐసీసీ ప్రకటించిన ఈ మార్గదర్శకాలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు.