Home » Rohit Sharma
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐకి ఓ సూచన చేశాడు. రో-కో ఉన్నన్ని రోజులు వన్డే సిరీస్లు పెంచాలని అన్నాడు.
ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. అయితే నేడు జరుగుతున్న మూడో రౌండ్కు వీరిద్దరూ అందుబాటులో లేరు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రోహిత్ ముంబై తరఫున ఆడబోడు. కారణాలు ఏంటంటే..?
2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురని ఏడాదిగా మిలిగిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఏడాది చివరిలో సౌతాఫ్రికాపై స్వదేశంలోనే క్లీన్ స్వీప్ అయ్యే వరకు ప్రతి మ్యాచ్ ప్రతి మూమెంట్ చిరస్మరణీయం.
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. వీరిద్దరూ వేరే వేరు జట్లకు ఆడుతున్నప్పటికీ.. తమ ఫామ్ని మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. రోహిత్ సెంచరీ చేయగా.. విరాట్ హాఫ్ సెంచరీ చేసి క్రీజులో కొనసాగుతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచులో సిక్కిం 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ముంబైకి 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుస హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ.. ముంబై తరఫున ఎలా ఆడతాడో చూడాలి.
నేటి నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఢిల్లీ-ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఆడుతుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రో-కో ఈ మ్యాచులకు ఎంత పారితోషికం తీసుకుంటారనే దానిపై చర్చ నడుస్తుంది.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్లు ఆడనున్నారు.
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని.. కావాలంటే ఇంగ్లండ్ ప్లేయర్లను అడగండని టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అన్నాడు. ఆసీస్ వేదికగా జరిగుతున్న యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-3తేడాతో సిరీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.
రెండేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం తాను క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు. ఆ సమయంలో తనతో పాటు జట్టంతా తీవ్ర నిరాశకు గురైందని ఓ కార్యక్రమం సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు హిట్మ్యాన్.