Home » Road Accident
అమెరికాను మంచు తుఫాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. హైవేలపై వాహనాలు జారిపోతూ.. ఒకదానిని మరొకటి ఢీకొంటున్నాయి. మిచిగాన్ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కారణంగా వందకు పైగా కార్లు, ట్రక్కులు ఢీకొన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వాహనానికి సోమవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ముంబైలో తన భార్య ట్వింకిల్ ఖన్నాతో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డుపై అతి వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కారుకు అడ్డంగా ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది..
సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేద్దామని స్వగ్రామానికి వచ్చి తిరుగు పయనంలో హైదరాబాద్ వెళ్లే క్రమంలో ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాలలోని పోరండ్ల సమీపంలో విద్యుత్ పోల్ను ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ యువకుడిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.
సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఐదుగురు టీచర్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది.
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత జాకీర్ మృతిచెందారు. జాకీర్ మృతి పట్ల మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.