Home » Road Accident
వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది చనిపోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
టైరు పేలి ఓ కారు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు కూడా వ్యాపించాయి. మంటల్లో కాలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భీమునిపట్నం జోన్లోని వలందపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
యాక్సిడెంట్ చేసిన వారు పారిపోవాల్సిన పని లేదని.. అక్కడే ఉండి బాధితులకు సహకరించి.. వారిని కాపాడాలని ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ హితవు పలికారు. అలా కాపాడిన వారు యాక్సిడెంట్ చేసిన వారైనా సరే గుర్తించి, వారికి రివార్డు ఇస్తామన్నారు.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
కర్నూల్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్వేపై బస్సు, ట్రక్కు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.