Home » Road Accident
రాంబిల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్ను మరో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సాయి కుమార్ టిప్పర్ క్యాబిన్లో చిక్కుకుపోయాడు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం ఇవాళ(మంగళవారం) జరిగింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
సౌదీ అరేబియా ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెబర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
భారతీయ యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
సౌదీ రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు.
తెలంగాణలో వరుస ఘోర రోడ్డు ప్రమాదాలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో పలువురు మృతిచెందుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతోండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓర్పై ఓ కారు బోల్తాపడింది. అలాగే కరీంనగర్ జిల్లాలో ట్రాలీ ఆటో బోల్తాపడింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి.
కర్నూలు శివారులో గత నెల 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.