Home » Road Accident
గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి నియోపోలీస్ బ్రిడ్జ్ పిల్లర్ను తవేరా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. వాహనాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే వీ2వీ (V2V), సీ-వీ2ఎక్స్ (C-V2X) వ్యవస్థల అమలుకు ముసాయిదా విడుదల చేసింది.
హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో కారుతో ఓ మైనర్ బీభత్సం సృష్టించాడు. ప్రమాదకరంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చాడు. వరుసగా ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టి విధ్వంసం చేశాడు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం విషాదాన్ని నింపింది.
విశాఖపట్నంలోని లంకెలపాలెం - అగనంపూడి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈరోజు తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బైక్ వెనకసీటుపై కూర్చొన్న వ్యక్తికి కూడా పరిహారం పొందే అర్హత ఉందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులను బలితీసుకుంది. రోడ్డుపక్కన నిలిచి ఉన్న లారీని స్విఫ్ట్ కారు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు..
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఏడాది వయసున్న చిన్నారి ఉండటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.
జమ్మూకశ్మీర్ గందర్బల్ జిల్లాలో ఇవాళ (మంగళవారం) ఉదయం అమర్నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ బస్సు అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు.
కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ సురేశ్ మృతి చెందారు.