Home » Revanth Reddy
దేశ వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హోటల్ తాజ్కృష్ణలో కేంద్రమంత్రితో సీఎం సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చూపేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఒక పూర్తి స్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులకు యజమానులయ్యే అవకాశాన్ని ఇస్తోంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మొత్తం 600 బస్సులు అందించనుంది.
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు.
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే అని హరీష్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం బిగ్ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు.. ఆ తర్వాత..
సౌదీ అరేబియా ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెబర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.