Home » Revanth Reddy
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సుబేదారి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. హనుమకొండలో బుధవారం ‘రైతు సంగ్రామ సదస్సు’ను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీకి సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.
ప్రాణాహిత నదిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం కలవనున్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
తెలంగాణ ప్రభుత్వం హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హజ్ యాత్రికులకు అదనంగా అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలిపింది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమబెంగాల్లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మూసుకుపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు.
సీఎం రేవంత్రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మన్నే క్రిశాంక్ని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో విద్యుత్ శాఖకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న విషయాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇరిగేషన్ శాఖ నుంచి పలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ...