Home » Revanth Reddy
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు.
తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు.
దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఉద్ఘాటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్తో సాధారణ ట్రాఫిక్లోనే ప్రయాణించడం ప్రత్యేకంగా నిలిచింది. తన ప్రయాణం వల్ల ప్రజలకు రహదారులపై ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు కోట్ల రూపాయలు ఎక్కడివని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సుబేదారి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. హనుమకొండలో బుధవారం ‘రైతు సంగ్రామ సదస్సు’ను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీకి సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.
ప్రాణాహిత నదిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం కలవనున్నారు.