Home » RCB
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానపై కోచ్ మలోలన్ రంగరాజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిందన్నాడు.
డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో చేతులు మారనుంది. ఆర్సీబీ కొనుగోలు కోసం బిడ్ వేస్తానంటూ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సీఈవో అదర్ పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
సయాలీ సత్ఘరే.. డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలకమైన మూడు వికెట్లను తీసి డెబ్యూలోనే అదరగొట్టింది. ఆర్సీబీకి ఆడాలన్న తన కోరిక నిజమైందంటూ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా రికార్డులోకెక్కింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. యూపీ వారియర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ స్పందించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన కెమెరామెన్పై అసహనం వ్యక్తం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.