Home » Rayadurg
మండల కేంద్రంలోని వెం కటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాల సందర్భంగా సోమ వారం తొలి రోజు శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
గత వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించకుండా పూర్తిగా పక్కన పెట్టిన వ్యవహారం ఇప్పుడు కూడా మారలేదు. ప్రభు త్వం మారినా కమిటీ పనితీరు మారకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మండలంలోని గోవింద వాడ గ్రామస్థులు తాగునీటికి చాలా ఇ బ్బందులు పడుతున్నారు. సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వ్య వసాయ బోర్లు వద్దకు పరుగులు తీ స్తున్నామని మండిపడుతున్నారు. గ్రామం లోని బసవేశ్వర కాలనీలో రెండు వారాలుగా నీటి సరఫరా నిలిచి పోయింది.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసే సామర్థ్యం ఒక్క టీడీపీతోనే సాధ్య మని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రగతి పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం గుంతకల్లు ఎ మ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి మండలంలోని గలగల గ్రామం లో పర్యటించారు.
మండలంలోని పలు గ్రా మాలకు తాగు నీరందించే పైపులు పలు చోట్ల లీకేజీ అవుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేడంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. విడపనకల్లు ఎస్ఎస్ ట్యాంక్ నుంచి పలు గ్రామాలకు రోజూ తాగు నీరు పంపింగ్ చేస్తుంటారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు పట్టణం లోని జంబుకేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, సాయంత్రం వేదపారాయణ చేశారు.
డీ. హీరే హాళ్లోని కురుబ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో శనివారం సుగ్లమ్మదే వి విగ్రహ ప్రతిష్ఠకు అంకురార్పణ చేశారు. ఉదయం గంగాపూజ చేశా రు.
భూరికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని డీ కొండాపురం గ్రామంలో గురువారం తహసీల్దార్ హరికుమార్ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం రూరల్ పరిధిలోని పల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెసోనీ అనే విద్యుత సంస్థ బహూకరించిన క్రికెట్ కిట్లను బుధవారం ఆ యన విద్యార్థులకు పంపిణీ చేశారు.
డీ. హీరేహాళ్ మండల తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా అధికారులు, వీఆర్ఓలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే కార్యాలయానికి చేరుకునే ప్రజలు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.