Home » Rayadurg
మండలంలోని ఉంతకల్లు గ్రామంలో వెలసిన రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవం గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్ర పండరీపురంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో నిర్వహించిన రథోత్సవానికి వేల మంది భక్తులు తరలివచ్చారు.
మండలంలోని తార్కాపురం గ్రామంలో రోడ్డుపై పారతున్న మురుగునీటిని తొలగించేందుకు పంచా యతీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో మురుగునీరు రహదా రిపై ప్రవహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుండేది.
స్థానిక రైల్వేస్టేషనకు వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న లింక్రోడ్డును పూర్తిగా ఆచరణలోకి తీసు కురావాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడిగా దీని కోసం నిరీక్షిస్తు న్నారు. ముఖ్యంగా పట్టణంలోని ఓబుళాచారిరోడ్డు నుంచి రైల్వేస్టేషన చాలా దగ్గర గా ఉంటుంది.
అమృత - 2 పథకం కింద రూ. 78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు పనులను త్వ రలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టణంలోని 29వ వార్డు పరిధిలో శుద్ధిచేసిన తాగునీటి సరఫరాను సోమవారం ఆయన ప్రారంభించారు.
కేబుల్ లైన్ల ఏర్పాటు పేరుతో రహదారిని తవ్వేశారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి. హీరేహాళ్ మండలంలోని బాధనాల, దొడఘట్ట గ్రామాల రోడ్డు పక్కన ఓ మొ బైల్ నెట్వర్క కేబుల్ పనుల కోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.
మండల పరిధిలోని ఉద్ధేహాళ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరప డిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.
స్థానిక డంపింగ్ యార్డ్ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు.
మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్కుమార్ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు.
మండలంలోని వడ్రవన్నూరు గేట్ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్, భాస్కర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.
అధికారుల మధ్య సమన్వ య లోపంతో రైతులకు చెందిన జొన్నల లారీల లోడు గోడౌన గేటు వద్దే నిలిపేశారు. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్ధేహాళ్ సహకార సం ఘం జొన్నల కొనుగోలు కేంద్రం నుంచి గుంతకల్లు గోడౌనకు తరలించి న రెండు లారీల జొన్నలను అనలోడ్ చేసుకోకపోవడంతో రైతులు, రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.