Home » Rayadurg
పట్టణంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు కేటాయించిన నిధులపై వైసీపీ డీసెంట్ నోటీసు ను సమర్పించి రూ. 3 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంది. స్థానిక ము న్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్పర్సన పొరాళు శిల్ప అధ్యక్షతన నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ గోవింద రాజులు అజెండాలోని 5వ అంశంగా ఉన్న రూ. 3 కోట్ల అభివృద్ధి పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉన్నత పాఠశాల దశ లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విద్యార్థులకు సూచిం చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల మైదా నంలో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు.
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు ప్రస్తుతం మరమ్మతులకు చేరుకున్నాయి. దిష్టిబబొమ్మలా దర్శనమిస్తున్నా యి. పట్టణంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఒకటో తరగ తి నుంచి తొమ్మిదో తరగతి వరకు 325 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు.
మం డలంలోని ఉప్పరహాళ్ గ్రామంలో వెలసిన నర సింహస్వామి, ఉప్పరల య్యస్వామి ఉత్సవాల సందర్భంగా జలధి కా ర్యక్రమం శనివారం అ త్యంత వైభవంగా జరి గింది. ఉదయం దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను వేదావతి హ గరి నది వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వాటిని నదీజలంతో అభిషేకించి, కొత్త బిదురుబుట్టలలో ఉంచి అలంకరించారు.
గ్రామీ ణ ప్రాంతాల పాలనలో కీ లకపాత్ర పోషించే పం చాయతీ కార్యదర్శుల కొర త మండలంలో వేధిస్తోం ది. గ్రామ పంచాయతీ ల లో ప్రభుత్వ పథకాల అ మలు, పన్నుల వసూలు, రికార్డులు, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు ప్రధానంగా కార్య దర్శులపైనే ఉంటాయి.
విద్యార్థినులు స్యయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య పేర్కొన్నా రు. స్ధానిక కళాశాలలో కుట్టు, ఎంబ్రాయిడరీ నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా కుట్టిన దుస్తులను ప్రదర్శించారు.
అంగనవాడీ కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని అంగనవాడీ వర్కర్స్, హెల్పెర్స్ యూనియన ఆధ్యక్ష, కార్యదర్శులు గోవిందమ్మ, మేరీ, సీఐటీ యూ నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు సోమవారం రిలే నిరాహర దీక్షలు చేప ట్టారు.
మండలంలోని గౌనూరులో నూతనంగా నిర్మించిన ఆ లయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం వైభ వంగా నిర్వహించారు. వేకువ జాము న గణపతి, నవగ్రహాలు, బొడ్రాయి, గోపుర కలశం, ధ్వజ ప్రతిష్ఠతో పాటు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
నేమకల్లు ఆంజనే యస్వామికి శనివారం విశేష పూజ లు జరిగాయి. ప్రధాన ఆర్చకులు అనిల్కుమార్ చార్యులు పూజలు జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం చేశారు. వెండి కవచ అలంకరణ, వడమాల సేవ చేశారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంమగా గుంతకల్లు పట్టణంలోని మాంటి స్సోరి పాఠశాలలో విద్యార్థులు అష్ట దిగ్గజ కవుల వేషధారణలో పా ల్గొన్నారు.