Home » Ranga Reddy
TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇవాళ(శనివారం) ఉదయం ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్లో అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాద్వాగం చోటు చేసుకుంది. అతి కాస్త ఘర్షణకు దారి తీసి ఇద్దరూ దారుణంగా కొట్టుకున్నారు.
Telangana: రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్ పల్లిలో రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న ఓ గోనెసంచిని జీహెచ్ఎంసీ కార్మికులు గుర్తించారు. వెంటనే దాన్ని తెరిచి చూడగా.. అందులో ఉన్నదాన్ని చూసి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కోకాపేట్(Kokapet)లో డిటోనేటర్ల బ్లాస్టింగ్స్(Detonators Blast) కలకలం రేపింది. నియో పోలీస్(Neo Police) వద్ద స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓ నిర్మాణ సంస్థ డిటోనేటర్లు పెట్టి పెద్దఎత్తున బండరాళ్లను పేల్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 చోట్ల డిటోనేటర్ల పెట్టి ఆ సంస్థ పేలుడుకు పాల్పడింది.
సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నోటీసు ఇచ్చారు.
Telangana: ఫ్లాట్లో భారీ శబ్ధం రావడంతో అపార్ట్మెంట్ వాసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి ఇంట్లోని వారు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఆపై ఫ్లాట్ పూర్తిగా మంటలకు దగ్ధమైపోయింది. అయితే వెంటనే బయటకు వచ్చేయడంతో ఐదు మంది కుటుంబసభ్యులు ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇంట్లో
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డిటిసి సెంటర్కు తరలించారు. డిటిసి సెంటర్కు వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అత్తాపూర్ హసన్ నగర్లోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఎప్పుడూ సక్రమంగానే అద్దె కట్టే ఆ కుటుంబం ఆర్థిక సమస్యల కారణంగా గత నెల రెంట్ చెల్లించలేదు. సరైన ఉపాధి లేకపోవడంతో వారు కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.