Home » Rammohannaidu Kinjarapu
విజయవాడ వేదికగా ‘రెడ్ బెలూన్ ఏరోస్పేస్’ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన ‘సూపర్ ప్రెషర్ బెలూన్’ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు.
టీడీపీ మహానాడుకు రికార్డు స్థాయిలో స్పందన లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్ల ద్వారా వర్చువల్గా ఆరు లక్షల మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నట్లు వెల్లడించారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తల్లి ప్రధాన మంత్రికి మొక్కను బహుకరించారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాంలో 'మత్స్య సాగరమాల' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార తీర ప్రాంత గ్రామాల్లోని కీలక సమస్యలపై దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరిగాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రతిపక్షాలను మహిళలు క్షమించరని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారితమని, జిల్లా ప్రజలకు సాగునీటి భద్రత కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వంశధార నీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను సస్యశ్యామలం చేయాలని పూనుకున్నట్లు ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి.
హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91 తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది.
తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని తమ నాయకుడు సీఎం చంద్రబాబు నేర్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ నేడు చరిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు.