Home » Rajnath Singh
భారత్ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూస్తారంటూ పొరుగు దేశం పాకిస్థాన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటితో ఏడాది పూర్తయింది.
పశ్చిమబెంగాల్లో దశాబ్దానికి పైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ మార్పును తీసుకురావాలని ఓటర్లను కోరారు.
రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జర్మనీకి బయలుదేరారు. గత ఏడేళ్లలో ఒక భారత రక్షణ మంత్రి జర్మనీలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, పారిశ్రామిక భాగస్వామ్యాల బలోపేతం ప్రధాన ఉద్దేశం.
కోల్కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను ఆయన చేయకుండా ఉండాల్సిందని, బెంగాల్పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని అన్నారు.
అరిదమన్ అనేది ఒక పదం కాదని.. ఒక శక్తి అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. శుక్రవారం విశాఖపట్నంలో భారత్ తన మూడో స్వదేశీ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ను ఆయన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది.
కేరళంలోని కష్టజీవులు, నిజాయతీపరులైన ప్రజలను దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటక్ ఫ్రంట్ వంచిస్తున్నాయని, రెండు కూటముల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడం కాకుండా రెండింటినీ ఇంటికి సాగనంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్లో అఖిల పక్ష సమావేశం జరిగింది.
పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.