Home » Rajahmundry
ఏపీలో ప్రతి రోజూ 7000 టన్నుల చెత్త వస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. గత చెత్త ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసిందని మండిపడ్డారు. చెత్త పన్ను వేసినా లక్షల టన్నుల చెత్త వదిలేసి వెళ్లిపోయిందన్నారు.
రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో గంజాయిని పోలీసులు గుర్తించారు.
మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై వైద్యులు ఆమెకు చికిత్స అందజేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో మెడికోలను వాహనంతో ఢీ కొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు.
గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోదావరిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఆంధ్రా పేపర్ మిల్, రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షాకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించారన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు.