Home » Rains
వేసవి కాలం.. అందునా రోహిణి కార్తె కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల ప్రవేశానికి ఇంకా సమయం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు బీభత్సం సృష్టించాయి.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజలను గాలివాన అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈరోజు ఉదయం మైలవరంలో పర్యటించారు.
అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం పలు మండలాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గాలి బీభత్సం, అకాల వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తిరుమలలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ రాత్రి సమయానికి నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రతపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.