Heavy Rains: కోస్తా జిల్లాలకు తుఫాన్ హెచ్చరిక..
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:15 AM
బంగాళాఖాతంలో ఏర్పఇన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన తూత్తుకుడి జిల్లా జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఆగిపోయారు.
- చేపల వేటకు వెళ్లని మత్స్యకారులు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పఇన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన తూత్తుకుడి జిల్లా జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఆగిపోయారు. దీంతో తూత్తుకుడి ఫిషింగ్ హార్బర్లో 200 మరపడవలు, 300లకు పైగా నాటు పడవలు తీరానికే పరిమితమయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగండంగా బలపడిందని, ఇది శనివారం ఉత్తరాంధ్ర, దక్షణ ఒడిశా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండ ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శని, ఆదివారాల్లో జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News