Home » Rahul Gandhi
కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్గాంధీ తప్పుకోవాలని, ప్రాంతీయ నేతలకు అప్పగించాలని సూచించారు.
మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారంనాడు బివాండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే వేసిన పరువునష్టం కేసులో కొత్త పూచీకత్తు సమర్పించేందుకు రాహుల్ కోర్టుకు వచ్చారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ (India AI Impact Summit)కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడంపై బీజేపీ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపైకి వచ్చారు.
భారత్జోడో యాత్రలో రాహుల్తో కనిపించిన వ్యక్తే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసినట్టు బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక ఫోటోను తాజాగా షేర్ చేశారు.
తెలంగాణలో రెండేళ్ల పాలనను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రశంసించింది. పార్టీ పనితీరుపైనా సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. ఇలాగే కలిసి ముందుకెళ్లాలని సూచించింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలిపింది.....
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ నేతలు ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని రాహుల్గాంధీ సూచించారు..
మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్కు సంబంధాలు ఉన్నాయని, ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని అన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మన రైతులను వంచించారని, దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అది ఒక ఫేక్ మీటింగ్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.