Home » Rahul Gandhi
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) జారీ చేసిన అడ్వైజరీపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగిస్తున్న విద్యార్థులను బెదిరించడం అంగీకారయోగ్యం కాదని ఆయన మండిపడ్డారు.
'నీట్' వ్యవహారంపై నేటికి వరుసగా ఐదో రోజు పార్లమెంట్లోని 'మకర్ ద్వార్' వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేదా ఆయనను బర్తరఫ్ చేయాలని విపక్ష ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
నీట్ పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు కోరుతూ ఉద్యమిస్తున్న విద్యార్థులకు ప్రతిపక్ష కూటమి (INDIA Alliance) పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.
'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
గత 10 ఏళ్లల్లో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదని అన్నారు.
అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ, పోలీసుల పాశవిక దాడికి ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్పై పార్లమెంట్లో చర్చకు సంబంధించిన విషయంలో రాహుల్ మాట తప్పారంటూ మండిపడ్డారు.