Home » Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారనాడు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనలను రాహుల్ పాటించాలని, నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు ముందు లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటేరియట్కు ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అని ప్రధాని మోదీ భావిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మండిపడ్డారు. సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ విషయంలో అపోజిషన్ లీడర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.
ప్రశ్నాపత్రం లీక్ కారణంగా నీట్ పరీక్ష రద్దు కావడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని లక్షల మంది కష్టాన్ని, కలల్ని బీజేపీ ప్రభుత్వం ఛిద్రం చేసిందని విమర్శించారు. ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదని, యువత భవిష్యత్తును కాలరాసే నేరమని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారని అన్నారు. ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో చెప్పే పరిస్థితికి మోదీ వచ్చారంటూ మండిపడ్డారు.
కేరళ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మిత్ర పక్షాలతో ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సుబేదారి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. హనుమకొండలో బుధవారం ‘రైతు సంగ్రామ సదస్సు’ను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు.
టీవీకే పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పురోగతి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని మోదీని కోరారు.
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమి చెందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొందరు కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోవడంపై ఆ పార్టీ అగ్రనేత సీరియస్ అయ్యారు. ఇది ఒక పార్టీ ఓటమి మాత్రమే కాదని.. దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే దిశగా బీజేపీ వేసిన అడుగని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో కమర్షియల్ గ్యాస్ ధర భారీగా పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇలా జరుగుతుందని ముందే చెప్పానంటూ ఎక్స్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.