Home » Rahul Gandhi
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఈసీని వాడుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ నియామకంలో మోదీ, అమిత్షాకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు.
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాలే ఇండిగో వైఫల్యానికి కారణమని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇందుకు నిస్సహాయ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని అన్నారు. భారత్లోని ప్రతి రంగంలో న్యాయమైన పోటీ అవసరమని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
Rahul Gandhi Slams Modi: జులై 9వ తేదీతో భారత్, అమెరికా టారిఫ్ ఒప్పందం రద్దు కానుంది. ఇదే గనుక జరిగితే మళ్లీ ట్రంప్ తెచ్చిన టారిఫ్ విధానాలు భారత్కు కూడా వర్తించనున్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పార్లమెంట్ మీటింగ్ హాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు భుజం నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన రాహుల్ ఆయనకు కొద్దిసేపు మసాజ్ చేశారు.
ఈ రాత్రి 8 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. తిరిగి రేపు రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా మరికొందరిపై ఢిల్లీ ఈవోడబ్ల్యూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు నమోదు చేసింది.
బిహార్లో కాంగ్రెస్ పరాజయంపై ఇటీవల కూడా ఇందిరాభవన్లోనూ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థలను అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా ఆస్తులను రూ.50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కుంచుకున్నారని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది.