Home » Puttaparthy
పేదలకు అండగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణ పనులు చేపట్టే విషయంపై టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. రూ.15లక్షలు వ్యయంతో పాఠశాలలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు వివాదం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి.
నియోజకవర్గంలో 21వ తేదీన నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి సూచించారు.
ఎండుమిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని యార్డ్ అధికారులకు వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డ్లో ఎండుమిర్చీ క్రయ విక్రయాలను పరిశీలించారు.
వైసీపీ నేత జగన, ఆపార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ పేరిట చేస్తున్నది ఒక నాటకం అని, ప్రజల్లో విద్యార్థుల్లో స్పందన కరవయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మేజర్ పంచాయతీ అధికారులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని అన్నిరకాల దుకాణాలు, హోటళ్ల వద్ద ప్రత్యేక ప్లా స్టిక్ టబ్బులను ఏర్పాటు చేస్తోంది.
ఎస్పీ సతీష్కుమార్ మంగళవారం మండలకేంద్రం లోని పోలీస్ స్టేషనతో పాటు సర్కిల్ కా ర్యా లయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్స్టేషన భవనాన్ని పరిశీ లించారు. పైకప్పు పెచ్చులూడి కడ్డీలు దర్శన మిస్తుండడంతో సమస్య ఏమిటని సీఐ నరేం ద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ప్రతి విద్యార్థి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ కష్టపడికాక ఇష్టపడి చదివితేనే బంగారు భవిషత్తు ఉంటుందని యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు భూతన్న అన్నారు.
కార్మిక సమస్యలపై 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ ఆల్ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
పట్టణంలోని అన్నివీధులు ఇక సీసీరోడ్లుగా మార్చుతామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని మూడో వార్డులో రూ.92.5కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.