Home » Puttaparthy
గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక విజ్ఞాన పాఠశా లలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. నెమలి నృత్యంతో పాటు భరత నాట్యం, లం బాడీ నృత్యం ఆకట్టుకుంది.
గణతంత్ర దినోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండలకేం ద్రాలు, గ్రామాల్లో జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు, విద్యాసంస్థల్లో అధికారులు, నిర్వాహకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి గణతంత్ర దినం ప్రాముఖ్యతను వివరించారు.
దశాబ్దాలుగా అభివృధ్దికి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేతలు మారినా తమ తరలరాతలు మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాలకు సరైన రోడ్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లోకి కనీసం అత్యవసర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది.
చౌకడిపోలకు బియ్యం తరలించే లారీ గురువారం మండలకేంద్రంలోని నాగలకట్ట సమీపంలో రోడ్డుపై ఆగిపోయింది. అది కదిరి- రాయచోటి ప్రధాన రోడ్డు కావడంతో... ఆ రోడ్డు వాహనాల రాకపోకలు పూర్తిగా రెండు గంటలపాటు నిలిచిపోయాయి. రోడ్డుకిరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
మండలకేంద్రంలో మురు గునీటి సమస్య తిష్టవేసింది. వీధుల్లోనే మురుగునీటితో కలిసి వృఽథానీరు పారుతోంది. మండల కేంద్రంలో అక్కదేవతల గుడి నుంచి సర్పంచ భారతి ఇంటి వెనుక భాగం మీదుగా పుట్టపర్తి ప్రధాన రోడ్డు వరకు, బీసీకాలనీ, పాతబాలాజీ పాఠశాల వెనుక వరకు మురుగునీటి కాలువ ఉంది.
సచివాలయంలో పనిచేస్తున్న ఏఎనఎంలకు ఇతర డ్యూటీలు వేయరాదని ఎన్జీఓ సంఘం నాయకులు కలెక్టర్ శ్యాంప్రసాద్ను కోరారు. కలెక్టరేట్లో మంగళవారం వారు కలెక్టర్ను శాలువాతో సన్మానించి, తమ సమస్యలను వివరించారు. ము ఖ్యంగా ఏఎనఎంలకు ఇతర పనులు ఇవ్వడం వలన డ్యూటీకి ఇబ్బందిగా ఉందని వివరించారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మంగళవారం స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మం డలపరిధిలోని 14 పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి, తనిఖీ చేశారు. వాటి ఖర్చులు, వివరాలను ప్రజావేదికలో వెల్లడించింది.
త్యాగానికి ప్రతీక వాసవీ మాత అని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వా సవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం బుక్కపట్నం లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలో ్లఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలుచేశారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవీ మాత ఆత్మార్పణ దినాన్ని పట్టణంలోని కన్యకాపరమేశ్వర ఆల యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వ హించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వాసవీ మాతకు వెయ్యిలీటర్లకుపైగా పాలతో అభిషేకం చేశారు.
తన పద్యాల ద్వారా సమానత్వం, మానవత్వం, నైతిక విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన అని జాయింట్ కలెక్టర్ (జేసీ) మౌర్యభరద్వాజ్ కొనియాడారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.