LORRY: రోడ్డుపై ఆగిపోయిన లారీ
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:53 PM
చౌకడిపోలకు బియ్యం తరలించే లారీ గురువారం మండలకేంద్రంలోని నాగలకట్ట సమీపంలో రోడ్డుపై ఆగిపోయింది. అది కదిరి- రాయచోటి ప్రధాన రోడ్డు కావడంతో... ఆ రోడ్డు వాహనాల రాకపోకలు పూర్తిగా రెండు గంటలపాటు నిలిచిపోయాయి. రోడ్డుకిరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
నంబులపూలకుంట, జనవరి 22(ఆంధ్రజ్యోతి): చౌకడిపోలకు బియ్యం తరలించే లారీ గురువారం మండలకేంద్రంలోని నాగలకట్ట సమీపంలో రోడ్డుపై ఆగిపోయింది. అది కదిరి- రాయచోటి ప్రధాన రోడ్డు కావడంతో... ఆ రోడ్డు వాహనాల రాకపోకలు పూర్తిగా రెండు గంటలపాటు నిలిచిపోయాయి. రోడ్డుకిరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్ఐ క్రిష్ణమూర్తి, ఏఎస్ఐ కిషోర్కుమార్రెడ్డి స్పందించి వెంటనే లారీకి అదనపు బ్యాటరీ ద్వారా మరమ్మతులు చేయించారు. వాహనాల రాకపోలకు ఇబ్బందిలేకుండా చేశారు. దీంతో ప్రయాణికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....