Home » Puttaparthi
మండలపరిధిలోని గూటి బైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను గు రువారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా యాత్రికులతో కిటకిట లాడింది. అమ్మవారిని సిం హవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. యాత్రి కులు తిమ్మమ్మను దర్శిం చుకుని, మర్రిమాను వద్ద కుటుంబ సభ్యులతో సేద దీరారు.
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆం గ్ల నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం బారులుతీరారు.
గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాలలోని చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి, దానిని రైతుల కు విక్రయించడంద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో 2014లో టీడీపీ ప్రభుత్వం చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని ఆయా గ్రామ పంచాయతీ కేంద్రాలలో రూ. లక్షల వెచ్చించి నిర్మించింది.
నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందా లని పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ పిలుపినిచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేక్కట్ చేసి పోలీసుఅదికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియచేశారు.
నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మం డల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠ శాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పా ఠశాలలో 1997-98 బ్యాచ పదో తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఒకే చోట చేరారు. పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదివిన పాఠశాలకు రూ. 80,000 వి లువ చేసే ఎనిమిది సీసీ కెమెరాలను అందజేశారు.
పేదలకు అండగా, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేం ద్రంలో జాయ్అలుక్కాస్ సౌజన్యంతో నిర్మించిన సత్యసాయి చిల్డ్రన పార్క్ను మాజీ మంత్రి శనివారం పరిశీలించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతి రేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేసేందుకు కార్యాచ రణ రూపొందిస్తామని సీఐటీ యూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జి. ఓబులు పేర్కొన్నారు. ఆయన శనివారం ఓబులదేవరచెరువులో సీఊటీయూ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ అమడగూరు, ఓడీ చెరువు మండలాల నాయకులతో శుక్రవారం ఆయన చర్చించారు.
మండల కేంద్రానికి సమీపం లో ఎం. కొత్తపల్లి వద్ద బం డపై వెలసిన అ య్యప్ప స్వామి సన్నిధానంలో స్వామి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువా రం ఆలయ నిర్మాణ సంకల్ప కులు పచ్చార్ల ఆంజినేయులు నాయుడు ఆధ్వర్యంలో స్వా మి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.