Home » Puttaparthi
సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సింగపూర్ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.
దివ్యాంగులను ప్రోత్సహిస్తే మిగతావారితో సమంగా రాణించగలరని జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి మజీదు సయ్యద్ పస్పల్లా పేర్కొన్నారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారితో పాటు సీఐ మారుతీశంకర్, బార్ అసోసియేషన ప్రెసిడెంట్ గంగిరెడ్డి, ఎంఈఓ-1 సోమశేఖర్నాయుడు, ఎంఈఓ-2 జయచంద్ర ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.
స్థానిక ఎంపీపీ ప్రసాద్ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.
జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్స, డీఎంహెచఓకి సూచించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సిఽంధూరరెడ్డి అన్నారు. చినగానిపల్లిలో సోమ వారం నిర్వహించిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మండలంలోని మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ, కసముద్రం, సోలుకుంట్ల, బలకవారిపల్లి, అమడగూరు, చినగానిపల్లి పంచాయతీలో ఎనటిఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.
మండలపరిధిలోని చౌటకుం ట పల్లి నుంచి కదిరి మెయిన రోడ్డుకు లింక్రోడ్డు పనులు జరగుతు న్నాయి. ఈ రోడ్డుకు అనుకుని మూడు పాడు బడిన బావులు ఉన్నా యి. ఈ బావుల వద్ద ఎలాంటి రక్షణ గోడలు లేవు. బావుల వద్ద గోడ లు లేకపోవడం వల్ల లింక్ రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా వచ్చి నప్పుడు వాహనదారులు ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించిని ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
నియోజకవర్గంలోని ఆర్హులైన ప్రతిఒక్క రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని వెంగళమ్మచెరువులో శనివారం నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. మండలంలోని బత్తినపల్లిని ఆమె గురువారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కలుషి త ఆహా రం తిని గ్రామంలోని పలువురు అస్వస్థతకు గురైన విషయంపై ఆమె గ్రామంలో రోగులతో, గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.