Home » Puttaparthy
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. లచ్చన్న సాహసానికి, కార్య దీక్షతకు మెచ్చి ప్రజలే సర్దార్ అనే బిరుదును ఆయనకిచ్చారని గుర్తు చేశారు.
మండలకేంద్రానికి సమీపంలో రాచువారిపల్లికి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఆ రువైపుల ప్రభుత్వం వివిధ హాస్టల్ భవనాలను నిర్మించింది. బీసీ బాలికల, ఎస్సీ బాలిక, బాలుర, ఎస్టీ బాలుర హాస్టళ్లను రూ. కోట్లు ఖర్చు చేసి గతంలో నిర్మించారు. వాటికి ప్రహరీ నిర్మించి, గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో గురువారం ఆయన జిల్లాలో వినాయక మండపాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత, పంచాయతీ, మున్సిపల్ శాఖాధికారులతో సమీక్షించారు.
ప్రతి ఒక్కరు జాతీయ భావం పెంపొందించుకోవాలని కలెక్టర్ చేతన పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా గురువారం సత్యసాయి సూపర్స్పెషలిటీ ఆసుపత్రి నుంచి వై జంక్షన వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైజంక్షన వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. దేశభక్తి ఉట్టిపడేలా అందరిచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన రైతుల పొలాలను తహసీల్దార్ ఉదయ్శంకర్రాజు పరిశీలించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ఓ పట్టాన తెగదే..’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ చేతన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్పందించి రొద్దం తహసీల్దార్తో ఆరాతీశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నోరకాలుగా ఆర్డీటిసంస్థ చేయూతనిచ్చిందని, ఆ సంస్థకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ స్థలంలో నివాసమున్న పేదలకు న్యాయం చేయాలని తహసీల్దార్ మారుతికి సోమవారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు.
హిందూపురం నియోజకవర్గంలో ఆర్అండ్బీ రహదారులు, వంతెన నిర్మాణం కోసం రూ.45కోట్లు నిధులు విడుదలైనట్లు మున్సిపల్ చైర్మన రమేష్, ఎమ్మెల్యే పీఏ వీరయ్య తెలిపారు.
గోరంట్లలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలోని బేతేలు చర్చి వీధి, పెన్షనర్స్ భవనం వెనుక వీధుల్లో వరస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని మాజీ మంత్రిపల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. మండలంలోని గూ నిపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు జుటూరు ప్రభాకర్రెడ్డి, డైరెక్టర్ శ్రీరాములు ప్రమాణ స్వీకారానికి పల్లె హాజరై మాట్లాడారు.