Home » Puttaparthy
ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించారు.
భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు.
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు.
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి చాటి చెప్పారని పేర్కొన్నారు.
సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు.
మండలంలో అనుమతిలేని లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పొలప్ప హె చ్చరించారు. శుక్రవారం రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు అన్న కథ నం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.