Home » Puttaparthy
వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేష్ విగ్రహాలు గురువారం మధ్యాహ్నం నుంచి గుడ్డం కోనేరు వద్ద నిమజ్జనానికి క్యూకట్టాయి. భక్తులు రంగులు చల్లుకుంటూ కులమతాలకు అతీతంగా నృత్యాలు చేస్తూ లంబోధరుడి ఊరేగింపులో ముందుకు సాగారు.
వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీ పరిధిలో రూ.లక్షలోపు జరిగిన పనులకు సంబంధించి విజిలెన్స ఎంక్వైరీ చేయిస్తామని ఎమ్మెల్యే ఎంఎ్స రాజు అన్నారు. శనివారం నగరపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. రెండువారాలపాటు ఎడితెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గ్రామాల్లో వీధులు, రహదారులు చిత్తడిగా మారాయి.
రైతులకు యూరియా సరఫ రా చేయాలని కోడిపల్లి గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు.
పట్టణంలో ఇటీవల జరిగిన మురుగు కాలువల పూడికతీతలో ఏవిచారణకైనా సిద్ధమని మున్సిపల్ చైర్మన రమేష్ సవాల్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చైర్మన అధ్యక్షతన నిర్వహించారు.
కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీనిపై పలుమార్లు ట్రాన్సకో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపనపోలేదని తిమ్మాపురం రైతులు వాపోతున్నారు.
పట్టణంలో చవితి సందడి మొదలైంది. వాడవాడలా, వీధివీధిన విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు యువకులు పోటీపడుతున్నారు. చవితి రోజు పూజా సామగ్రి కొనుగోలుకు యువత తరలి వస్తున్నారు. పట్టణంలోని వీధుల్లో వినాయక మండపాల ఏర్పాట్లలో యువత నిమగ్నమయ్యారు.
త్రైత సిద్ధాంత ప్ర బోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల పరిధిలోని తుంపర్తి గ్రామంలో శ్రీకృష్ణుడి ఊరేగింపును ఘ నం గా నిర్వహించారు. ఈ నెల 16న కృష్ణా ష్టమి నుంచి పూజలందుకున్న శ్రీకృష్ణుడి ప్రతిమను గురువారం అలంకరించి గ్రామంలో ఊరేగించారు. స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సేవాసమితి సభ్యులు తరలివచ్చి గ్రామోత్సవంలో భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
క్రీడల్లో ప్రతిభ చాటే విద్యార్థులకు తన వంతు సహాయ స హకారాలు అందిస్తా నని టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్ పరి టాల శ్రీరామ్ పేర్కొ న్నారు. ఒంగోలులో ఈనెల 17న జరిగిన 43వ యానివర్సిరీ ఆలిండి యా ఓపెన కరాటే చాంపియన షిప్లో ప్రతిభచాటిన ధర్మవరం విద్యా ర్థులను ఆయన మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అభినందించారు.
గంటల కొద్దీ త్వరగా వెరిఫికే షన పూర్తి చేయాలని దివ్యాంగ పింఛన దారులు సోమవారం స్థానిక ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొంతమంది దివ్యాంగుల పేరుతో ధృవప్రతాలు సంపాదించి పింఛన్లు పొందుతున్నారు.