Home » Puttaparthy
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు తదితర వసతి గృహాలకు సరుకుల సరఫరా టెండర్ల ప్రక్రియ సోమవారం స్థానిక కలెక్టరేట్లో గందరగోళంగా సాగింది. గత వైసీపీ పాలనలో సరఫరా చేసిన వారికే మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు టెండర్దారులు.. సమగ్రశిక్ష అతనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) సంపూర్ణను నిలదీశారు.
వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారుల వద్దకొచ్చే అర్జీదారులను గౌరవించి, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా, ముందస్తు చర్యలతో ఈఏడాది నేరాలు తగ్గాయని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్లో 2024కి సంబంధించిన పోలీసు వార్షిక నివేదికను సోమవారం ఎస్పీ వెల్లడించారు.
పౌరహక్కులపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ ఎ. రత్న పేర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీకాలనీలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీతో సమీక్ష నిర్వహించారు.
తండాను స్వీయనిర్బంధం చేసుకున్నారు గిరిజనులు. తాము.. ఈ జనంతో కలవలేమనీ, తమ తండాలోకి ఎవరూ రావద్దంటూ మండలంలోని పత్యాపురం ఎగువ తండావాసులు శుక్రవారం ముళ్లకంప వేసుకుని, నిరసన తెలిపారు. తండాను స్వీయనిర్బంధం చేసుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత అన్నారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులుతీస్తోందని, ఇది ఓర్వలేకే మాజీ సీఎం జగన, వైసీపీనాయకులు విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి అన్నారు.
కరువు ప్రాంతమైన ముదిగుబ్బ మండలంలోని యోగివేమన ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని నెరవేరుద్దామని నూతన కమిటీ సభ్యులతో నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు.
గ్రీన ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంతో తమ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకుండపోతోందని, రోడ్డు సౌకర్యం కల్పించాలని రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.