Home » Puttaparthy
ద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే నియమించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీటీఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
జాతీయ ఉపాఽధి పథకంలో నకిలీ జాబ్కార్డుల వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ సీరియస్ అయ్యారు. ఇటీవల ఉపాధి పథకంలో నకిలీ జా బ్కార్డులతో సొమ్ము కొల్లకొడుతున్న విషయంపై ఆంరఽధజ్యోతిలో కథనాలు ప్రచురితమయ్యాయి.
మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్డుంతా దుర్వాసతో వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. నాగలూరు గ్రామంలో ఇళ్లమధ్యనే మురుగునీరు నిలిచాయి. డ్రైనేజీలో నీరు పారక ఎక్కడిక్కడ స్తంభించాయి.
అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహనరెడ్డి మేం అధికారంలోకి వచ్చాక సప్తసముద్రాల అవతలున్నా టీడీపీ నాయకులను, అధికారులను లాక్కొస్తానని పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు.
నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సకాలంలో వేతనాలు అందకపోవడంతో పనులు మానేస్తున్నారు. దీంతో గామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు.