Home » Puttaparthi
ఆ గ్రామాలకు వెళ్లే రహదారుల గుండా ప్రజలు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు ఎటువం టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ రహదారు ల మలుపులు, స్పీడుబ్రేకర్లు వద్ద ఎటువంటి సూచిక బోర్డులు రేడియంస్టిక్కరు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
పట్టణంలోని సిద్దయ్యగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద వెలసిన అవదూత తిక్కనారాయణస్వామి ఆరాధనోత్సవాలను బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ చైతన్యభక్త భజన మండలి సభ్యు లు తెలిపారు.
గత ఏడాది డిసెంబరు 17న పుట్టపర్తి డివిజన స్థాయిలో విద్యార్థులకు ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. క్విజ్లో మొదటి మూడు బహుమతులు వరుసగా రూపశ్రీ(జడ్పీహెచఎస్, కొరివాండ్లప ల్లి). సి.వరుణ్(జడ్పీహెచఎస్, సిద్దరాంపురం), కే.వాణి(జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల, కొత్తచెరువు) విద్యార్థులకు అందజేశారు.
గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక విజ్ఞాన పాఠశా లలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. నెమలి నృత్యంతో పాటు భరత నాట్యం, లం బాడీ నృత్యం ఆకట్టుకుంది.
గణతంత్ర దినోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండలకేం ద్రాలు, గ్రామాల్లో జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు, విద్యాసంస్థల్లో అధికారులు, నిర్వాహకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి గణతంత్ర దినం ప్రాముఖ్యతను వివరించారు.
స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కొళాయి కనెక్షనలు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కొళాయి కనెక్షనలు తీసుకుంటున్నా అ ్డడిగే వారేలేరు. సాధారణంగా మున్సిపాలిటీలో రూ.500లోపల ఇంటి పన్ను చెల్లించేవారు రూ. 1250, ఆ పైన చెల్లించేవారు రూ. 9వేలను ఆనలైన ద్వారా మున్సిపాలిటీకి చెల్లించాలి.
చట్టాలపై విద్యార్థులు అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా పోలీసు స్టేషన డీఎస్పీ ఇందిర సూచించారు. జాతీయ బాలికా దినోత్సవ సంద ర్భంగా ఎస్పీ సతీశకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఇందిర శనివారం పోలీస్ సిబ్బంది, ధర్మవరం శక్తిటీం-1తో కలిసి పట్టణంలోని పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలకేంద్రంలో శనివారం ఖాసింస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఉద యం పురుషులకు ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. మొదటి దశ పోటీలలో ప్రతిభ కనబరిచిన తోపుదుర్తికి చెందిన మధుకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, అరవకూరు రామంజికి రెండో బహుమతి రూ. 7వేలు, బానుకోటకు చెందిన రాజుకు మూడో బహుమతి రూ. 3 వేలు అందజేశారు.
మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిట లాడింది. ఈ సందర్భంగా అర్చకులు మూలవిరాట్ను ప్రత్యేకంగా అ లంకరించి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లిం చారు.
గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయయమని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలపరిధిలోని గూటిబైలు సమీపంలో వెలసిన తిమ్మమ్మమర్రిమాను వద్ద శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వివిధ సమస్యలపై వినతులు స్వీకరిం చారు.