Home » Puttaparthi
మండల కేంద్రంలోని పాత పోస్టాఫీసు సమీ పంలో ఓ ఇంటి ఎదుటే 11 కేవీ విద్యుత తీగలు వేలాడుతున్నాయి. దీంతో ఆ ఇంటిలోకి వెళ్లాలంటే తీగల కింద నక్కినక్కి పో వాల్సి దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ర వీంద్ర అనే గ్రామస్థుడు ఆ ఇంటిలోనే చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం నుంచి మండలంలో అన్ని పాఠశాలల్లో బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్లు ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి గౌసులాజం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండల విద్యాశాఖాధికారులు సురేష్ బాబు, రమణకు వినతిపత్రం సమర్పించారు.
చిన్నపిల్లలు చెరు వులు, నీటికుంటల వద్దకు వెళ్లకుండా తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ విజయ్కుమార్ సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి మండల పరిధిలోని బత్తలపల్లిలో డీఎస్పీ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ... వర్షాకాలం నేపథ్యంలో ప్రతిచోట చెరువులు, నీటి కుంటలు నిండుగా ఉన్నాయన్నారు.
మనిషి జీవిత సత్యాన్ని తెలిపే విధంగా వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యాన్ని రచించారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వారు మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా కొత్తచెరువుమండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహానికి పూల మాల వేసి పూజలు చేశారు. బుక్కపట్నంలోని వాల్మీకి రామాలయంలో పూజలు నిర్వహించారు.
సత్యసాయి గిరిప్రదక్షిణను సోమ వారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. రాత్రి 6-30 గంటల సమ యంలో గణేశ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యే క అలంకరణ చేసి పూజలు చేశారు.
లోఓల్టేజీ సమస్యను అధిగ మించేందుకు మండలంలోని వెంగళమ్మచెరువు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మించ తలపెట్టిన సబ్ స్టేషనకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సోమ వారం భూమిపూజ చేశారు.
జిల్లాలో శాంతిభద్ర తలకు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు. వారు శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని మర్యాద పూర్వ కంగా కలశారు. పుష్పగుచ్ఛం అందజేసి పట్టుశాలువాతో ఘనంగా సన్మానించారు.
రాష్ర్ట్రంలో కులగణన త్వ రగా పూర్తీచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సాయిఅరామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అద్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.
జిల్లాకేంద్రంలోని ఆర్వీజే కళ్యాణమండపంలో కవకోకిల గుర్రంజాషువా 130వ జయంతి వేడుకలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు.
జిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, లేక పోతే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ ప్రమీల అంగన్వాడీ కార్య కర్తల కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో శనివా రం అంగనవాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.