Home » Puttaparthi
కదిరి ని యోజకవర్గంలోనే తనక ల్లు మండలం పెద్దది. ఈ మండలానికి ఓ వైపు కర్ణాటక రాష్ట్రం, మరో వైపు అన్నమయ్య జిల్లా సరి హద్దులుగా ఉన్నా యి. మండల పరిధిలోని 17 పంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు, 186 కుగ్రామాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితోనే నియోజకవ ర్గం అబివృద్ది సాధ్యమని అమడగూరు మండలం దిండిమీదపల్లి వైసీపీ కార్యకర్తలు పేర్కొన్నారు.
ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. మండలం లోని కె.పూలకుంట పంచాయతీలో ఎమ్మెల్యే శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధి కారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజాద ర్బార్ నిర్వహించారు.
స్వర్ణాంధ్రప్రదేశ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని పాము దుర్తి గ్రామంలో శనివారం స్వర్ణ గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు.
పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో శ నివారం నిత్యానంద త్ర యోదశి వేడుకలను భ క్తులు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భం గా మందిరంలో ఉన్న జగన్నాఽథుడు, బలరాము డు, సుభద్ర ప్రతిమలను అందంగా అలంకరించారు. పంచా మృతాభిషేకాలు, పుష్పాభిషేకం, హరినామ సంకీర్తన, నైవేద్య సమర్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదు పులో ఉంచుకోవాలని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్య మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకు ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కల్తీమద్యం తాపించి ఎంతో మంది అమాయకుల మరణాలకు కారణమైన వైసీపీ నేతలు, తమ అక్రమార్జన కోసం భగవంతుడి సన్నిధి లో సైతం పాపం చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, నాయకులు రాళ్లపల్లి షరీఫ్ అన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులకు టీ, బిస్కెట్ ఇచ్చేందు కు సమా వేశాలు ని ర్వహిస్తున్నారా? అం టూ వెంకటాపురం ఎం పీటీసీ శ్రీనివాసులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గత సమావే శంలో తెలిపిన సమస్యల ఎంతవరకు పరిష్కరించారని నిలదీశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ తుమ్మల పర్వీన షామీర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. ఆయన గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరకాస్తులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్ స్వర్ణలతను అడిగి తెలుసుకు న్నా రు.
కోట్లాది మంది ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో గత వైసీపీ పాలనలో కల్తీ జరి గిందని సిట్ నివేదిక ఇచ్చినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుకాయి స్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని శివానగర్లో వెలసిన విజయచౌడేశ్వరి ఆలయ పుష్కర కుంభాభి షేకం, మహా సంప్రోక్షణ మహోత్సవంలో ఆ యన పాల్గొన్నారు.