Home » Puttaparthi
సత్య సాయి జయంతి వేడుకల సందర్భంగా చిత్రావతి సుందరీకరణ ఏర్పాట్లు చేశారు. అందులో భాగం గా స్నాన ఘట్టం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రక్షణ చర్యలు చేప ట్టకపోవడంతో భక్తులు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదా లు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు అంటున్నారు. జిల్లా కేం ద్రం సమీపంలో చిత్రావతి నది నీటితో నిండుగా ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు జిల్లా కేంద్రంలో ఆయా శాఖల అధి కారులు, సిబ్బంది ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా ప్రధాన వీధుల్లో విద్యుత శాఖ అధికా రులు కొత్తగా విద్యుత స్తంభాలు ఏర్పాటు చేస్తున్నా రు. గురువారం, శుక్రవారం స్థానిక గోపురం రోడ్డులో విద్యుత సిబ్బంది ఎత్తైన విద్యుత స్తంభాలను ఏర్పాట చేస్తున్నారు. పాత స్తంభాలను తొలగించి కొత్తగా ఎత్తైన స్తంభాలు మా ర్చే కార్యక్రమం చేపట్టడంతో జిల్లా కేంద్రంలో పగటిపూట విద్యుత సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు.
స్థానిక మార్కెట్యార్డ్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి మార్కెట్యార్డ్ చైర్మన, డైరెక్టర్లకు సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్యార్డ్లో తొలిసారిగా నూతన కమిటీ సమావే శాన్ని చైర్మన పూలశివప్రసాద్ అఽఽధ్యక్షతన గురువారం నిర్వహించా రు. మాజీ మంత్రి పల్లె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు.
ఇళ్లులేని నిరుపేదల కోసం ఉపయోగకరమైన నివాస స్థలాలను వెంటనే గుర్తించాలని పుట్టప ర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి రెవె న్యూ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని మామిళ్లకుంట్లపల్లి పంచాయతీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గతంలో ప్రభు త్వం పేదలకు కేటాయించిన ఎన్టీఆర్కాలనీ ప్రాంతాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పరిశీలించారు.
ఆత్మనిర్భర్ భా రత కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ, ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులనే వాడుదాం అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వార్డుల్లో, సూపర్మార్కెట్లలో స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేక్ఇన ఇండియా ఉత్పత్తులనే వాడుదాం, దేశ ఆర్థికవ్యవస్థను బలపరుద్దామంటూ ఆయన పేర్కొన్నారు.
ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో... చాలా ప్రాంతాల్లో ఎటు చూసినా గుంతల రోడ్లే ద ర్శన మిస్తున్నాయి. తర చూ రోడ్లను తవ్వడం.. పూ డ్చడం చేస్తుండడంతో సిమెంట్ రోడ్లు కాస్త మట్టి రోడ్లుగా, గుంతల రోడ్లుగా మారాయి. రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాట్ల పేరుతో ఉన్న సీసీ రోడ్లను తొలగించి పైప్లైన్లను వే శారు. పైపు లైన్లను పూడ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు రోడ్లను మాత్రం బాగు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
మండల పరిధిలోని ఆకు ల వాండ్లపల్లిలో సోమవారం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు తెలుగు దే శం పార్టీలోకి చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ సతీష్కు మార్ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేరస్థులను, రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఓ ప్రకటనలో తెలియచేస్తూ... మహిళలు, విద్యార్థినుల పట్ట అసభ్యకర ప్రవర్తనను మానుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హె చ్చరించారు.
సత్యసాయిబాబా శత జయంతి వేడుకల నాటికి పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరో 20 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.
మండలకేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డబుల్ రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డి పొద లను ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులు చాల ఇబ్బందులు పడు తున్నారు. నల్లమాడ నుంచి నుంచి దొన్నకోట గ్రామం మీదుగా పులగం పల్లి వరకు, నల్లమాడ నుంచి రాగానిపల్లి, గోపేపల్లి మీదుగా కొండె పా ళెం వరకు ఈ పరిస్థితి కనిపిస్తోంది.