GOD: ముగిసిన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:00 AM
పట్టణంలోని కొత్త పేటలో వెలసిన లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజు ల పాటు సాగిన వార్షిక బ్రహ్మోత్స వాలు సోమవారం ఘనంగా ము గిశాయి. చివరిరోజు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు.
ధర్మవరం రూరల్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కొత్త పేటలో వెలసిన లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజు ల పాటు సాగిన వార్షిక బ్రహ్మోత్స వాలు సోమవారం ఘనంగా ము గిశాయి. చివరిరోజు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో సుప్రభాత సేవ, పుష్పయాగం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వ హించారు. ఉత్సవమూర్తిని అశ్వవా హనంపై ఆశీనులను చేసి పట్టణవీ ధుల్లో ఊరేగించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించి, బ్రహ్మో త్సవా లను విజయవంతం చేశామ ని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....