Home » Puttaparthi
మాఘ మాసం ఆదివారం పురస్క రించుకుని మండలంలోని పలు గ్రామాల్లో పాల పొంగుల వెల్లువను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వ హించారు. తెల్లవారుజా మునే మాఘస్నానాలు ఆ చరించి కొత్తకుండలో పాలుపోసి పొంగులు ని ర్వహిం చారు.
స్థానిక కస్తూర్బా కాలనీలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో అనంతపురం రోడ్డులో కస్తూర్బా కాలనీ ఉంది. స్థానిక కస్తూ ర్బా పాఠశాల సమీపంలో గత టీడీపీ హయాంలో ఈ కాలనీ ఏర్పడింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 2017 నుంచి ఇళ్ల నిర్మాణం జ రుగుతూనే ఉంది.
జాతీయ స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో అభినందించారు.
ధర్మవరం పట్టణంలోని పలు ఆర్ఎంపీ క్లినిక్లలో శనివారం సాయం త్రం అధికారుల బృందం అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హేమంతకుమార్, తహసీల్దార్ సురేశబాబు, డాక్టర్ సురేశ, ఎస్ఐ ఉమాదేవి, వీఆర్ఓ రవిశేఖర్రెడ్డి పలు క్లినిక్లలో తనిఖీలు చేపట్టి, అక్క డ రోగులకు అందుతున్న చికిత్సల గురించిపరిశీలించారు.
మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, వే గవంతంగా పూర్తిం చేయాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య అధికా రులకు సూచించారు. సూచించారు. ఆయన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని శనివారం పరి శీలించారు.
మండలపరిధిలోని ప్ర పంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి సంద ర్భంగా మూడురోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు పోలీస్ బందో బస్తుపై శనివారం డీఎస్పీ శివనారాయణస్వామి పరిశీలించారు. జన సమీకరణ ఎక్కువగా ఉండడంతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసు కోవాలని ఆలకమిటీ వారితో చర్చించారు.
మండలకేంద్రంలోని ఏపీ మో డల్ స్కూల్లో సమస్యలు తిష్ట వేశాయి. పాఠశాలల ప్రతి సంవ త్సరం పిల్లల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కనీస మౌలి క వసతులు కల్పించడం లేదు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యా యులను కూడా నియమించడం లేదు.
వైఎస్ జగన్మోహన రెడ్డి దుష్ట పాలనకు కల్తీ లడ్డూ ఘటన పరా కాష్ట అని జనసేన పుట్టపర్తి ఇన్చార్జ్, ఇరిగేషన డెవలప్మెంట్ కార్పొరేషన డైరె క్టర్ పత్తి చలపతి వి మర్శించారు. ఆయ న గురువారం పుట్టపర్తిలోని జనసేన కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు
వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యమని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. పుట్టపర్తి గోకులం వీధిలో నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని గురువారం రాత్రి సందర్శించారు. కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో మాట్లాడారు. చదువు, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్ కింద పుట్టపర్తి పోలీసు సబ్డివిజనకు ఐదు నూతన వాహనాలు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్కుమార్, ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు.