Home » Puttaparthi
మున్సిపాలిటీ పరిఽధిలోని కుటా గుళ్ళకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల ప రిష్కారానికి రెవెన్యూ క్లీనిక్లు ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ఆ లోచనతో ఈ కార్యక్రమానికి రా ష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.
నిరుపేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జగనన్న కాలనీ ఏర్పాటు కోసం నల్లమాడ సమీపంలోని పాతరకుంట వద్ద ప్రభుత్వ భూమితో పాటు, 18 ఎకరాల ప్రైవేటు భూములు సే కరించారు. ఆ భూమిలో చిన్నచిన్న గుట్టలు, బండరాళ్లు అధికంగా ఉం డేవి.
మునిసిపాలిటీ పరిధిలోని 33, 34 వార్డులలో నెలకొన్న నీటి సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిష్కరించారు. నీటి కోసం 33, 34 వార్డులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని తెలుసుకున్న టీడీపీ స్థానిక నా యకులు సమస్యను ఎమ్మెల్యే కందికుంట దృష్టికి తీసుకెళ్లారు.
త్రికరణ శుద్ధి, దృఢ సంకల్పం, సామాజిక స్పృహ ఉన్న యువత నాయకుడిగా ఎదగగలరని సత్య సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
హైదరాబాద్కు చెందిన విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్, వేధిక్ మ్యాథ్స్ జోనల్ లెవల్ పరీక్షలలో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచినట్టు జోనల్ మేనేజర్ శివాంజనేయులు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ....కాకతీయ విద్యానికేతనలో నిర్వహిం చిన ఈ పరీక్షలకు పట్టణంలోని 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.
గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయ కులు ధర్మవరంలో పెద్దఎ త్తున మున్సిపల్, రెవెన్యూ స్థలాలను కబ్జా చేశారని, వాటిలో వాణిజ్య సము దా యాలను నిర్మించి విచ్చల విడిగా ప్రజాదనాన్ని దోపి డీ చేస్తున్నారని టీడీపీ నా యకులు ఆరోపించారు.
మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మున్సిపాలిటీ పరిధిలో మొక్కలను నాటి వాటి సంరక్షణను గాలికి వదిలేస్తుండడంతో ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు హడావుడిగా మొక్క లను నాటడం తప్ప ఆ తరువాత వాటి గురించి పట్టించుకున్న పాపాన పోవడంలేదు.
సీఆర్ఎంటీల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆ యూనియన నాయకులు శని వారం ఎమ్మెల్సీ రాంభూపాల్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారు ఎమ్మెల్సీని శనివారం అనంతపురంలో కలిసి వినతి పత్రం అందజేసి నట్లు ఆ యూనియన నాయకుడు రమణ తెలిపారు.
భూములపై సంపూర్ణ హక్కుదారులుగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలతో కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని కదిరికుంట్లపల్లిలో శనివారం రెవెన్యూ శాఖ ఆఽధ్వర్యంలో చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రైతుల భూముల రక్షణ కోసమే ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని లింగారెడ్డి పల్లిలో శనివారం రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.