Home » Puttaparthi
మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతిబాటిల్ను స్కాన చేసి విక్రయిం చాలని ప్రొహిబిషన, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్ద య్య సూచించారు. ఆయన మంగళవారం ధర్మవరం ఎక్సైజ్శాఖ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు.
మండలంలోని పలు పంచా యతీల్లో ఉన్న చెత్త సంపద కేంద్రాల ఆదాయం ఎక్కడ? అని డీఎల్డీఓ అధికారులను ప్రశ్నించారు. గాండ్లపెంట మండలం లోని సచివాలయాల తనిఖీలో భాగంగా ఆయన మంగళవారం మండల కేంద్రంలోని సచివా లయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు.
కడప జోన పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు.
మన భూమిపై మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుసుమవారిపల్లిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 68 మంది రైతులకు రాజ ముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
వైద్యానికి ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నా... మండలంలోని చాలా ఆరోగ్య కేం ద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓబు ళదేవరచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పైకప్పు పెచ్చు లూడి పడుతుండటంతో అధికారుల ఆదేశాల మేరకు తప్పని పరిస్థితు ల్లో ల్యాబ్ నిర్వహిస్తున్న గదిలోకి మార్చారు.
మదురో స్థానంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డిల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషం.
పట్టణ పరిసర ప్రాంతాల్లోని రెవెన్యూ, మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నాయకులు ఆర్డీవో మహేశకు విన్నవించారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవోను కలిసి ఆధారాలతో వినతిపత్రం అందజేశారు.
భారతదేశానికి యువతే బలమైన సంపదఅని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ యువ దినోత్సవం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా సన్మార్గంలో పయనించాలన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బెదిరిం పులు, దౌర్జన్యాలతో పెట్టుబడులు రాకుండా చేశారని, ఇప్పుడు అధికారం పోయాక కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగనపై టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 33 మంది లబ్దిదారులకు రూ.12.90లక్షల వి లువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన సోమవారం పట్టణంలోని టీడీ పీ ఎర్రగుంట కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీచేశారు.
ఏపీ అభివృద్ధికి చిరునామా ముఖ్య మంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే ప ల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నతపాఠశాల వసతిగృహం నిర్మా ణానికి వారు సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన శాఖాధికారి రాజేంద్రరె డ్డి హాజరయ్యారు.