Home » Puttaparthi
ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిద్దాం... లోపాలను సరిచేసుకుని సమష్టిగా పనిచేసి తల్లీబిడ్డలను కాపాడుకుందామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫైరోజ్బేగం పేర్కొన్నారు. స్థానిక సత్యసాయి సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం మాతాశిశు మరణాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా జరుపుకునే పండుగ సంక్రాంతి అని డైట్ ఇనచార్జ్ ప్రిన్సిపాల్ రామక్రిష్ణ, విశ్రాంత డీఈఓ మునెయ్య పేర్కొన్నారు. మం డలకేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గురువారం తెలిపారు. మండల పరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మె ల్యే యోగివేమన ఆలయానికి వచ్చారు.
ప్రజలకందిస్తున్న సేవల్లో పారదర్శకత, సమయ పాలన తప్పకుండా ఉండాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ రిజిసే్ట్రషన అధికారులకు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండలపరిధిలోని ధర్మ పురి నుంచి చిన్నూరు బత్తలపల్లికి వెళ్లే రహదారి మట్టిరోడ్డు కావడంతో కోతకు గురై ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణించాలంటే ఆ రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు.
మండలపరిధిలోని పంతు లచెరువు పంయతీ తెలగుట్లపల్లిలో బుధవారం వనం హనుమంత రెడ్డికి చెందిన ఇంట్లో విద్యుత షార్ట్ సర్క్యూ ట్ కారణంగా వస్తువులు దగ్ధమయ్యాయి. తెలగుట్లపల్లిలో నివాసముంటున్న వనం హను మంతరెడ్డి ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఆయన భార్య దీర్ఘకాలిక రోగంతో మంచాన పడింది.
త్యాగరాజు స్వామి ఆరాధనోత్సవాన్ని బుధవారం పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం, మంగళ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజుస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
యువత, విద్యార్థులు మత్తుకు బానిసలై చిత్తు కావద్దని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. మా దకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా... పట్టణంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయాధికారి పాల్గొని మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో ప్రజల కు అత్యంత బాధ్యతతో సేవలందించాలని ఎమ్యెల్యే పల్లె సింధూ ర రెడ్డి ఆశావర్కర్లకు సూచించారు. నూతనంగా నియమితులైన ఏడు గురు ఆశావర్కర్లకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు నియామక పత్రాలను అందజేశారు.
మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సకాలం లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతు న్నారు. ఓబుళదేవరచెరువు, అమడగూరు మండలాలకు కలిపి అమ డగూరు మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు.