• Home » Puttaparthi

Puttaparthi

POLE: దెబ్బతిన్న విద్యుత ఇనుప స్తంభాలు

POLE: దెబ్బతిన్న విద్యుత ఇనుప స్తంభాలు

మండల కేంద్రంలోని కమ్మపాళ్యం ప్రాంతం లో రెండు ఇనుప స్తంభాలు అడుగుభాగాన తుప్పుపట్టాయి. అవి ఏ సమయంలో కూలు తాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం. గాలి, వాన బలంగా వస్తే ఆ స్తంభాలు కూలే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతో ఏ సమ యంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంభయంగా గడుపుతున్నారు.

FESTIVAL: ఘనంగా రాఖీ పౌర్ణమి

FESTIVAL: ఘనంగా రాఖీ పౌర్ణమి

నియోజకవర్గంలోని అక్క, చెల్లెమ్మలకు సరైన ఉపాధి చూపించేందుకు తనతో పాటు ప్రభు త్వం కట్టుబడి ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో రక్షాబం ధన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పరిటాల శ్రీరామ్‌కు తెలుగు మహిళలు, పలు వర్గాలకు చెందిన మహిళలు పెద్తఎత్తున తరలివచ్చి రాఖీలు కట్టారు.

MLA: వైసీపీ ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌

MLA: వైసీపీ ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌

గత వైసీపీ పాలనలో అమలు చేసిన ప్రతి స్కీమ్‌లోను స్కామ్‌ దాగి ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మండిపడ్డారు. శనివారం మండలకేంద్రంలో శనివారం సహకార సంఘం అధ్యక్షుడు చెన్నక్రిష్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి, పార్టీ కార్యాల యం ప్రారంభానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలన లో ప్రతి పథకంలో అర్హుల కంటే వైసీ పీ నాయకులకే అధికంగా లబ్ధి చేరుకూరిందన్నారు.

TDP:  యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తాం

TDP: యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తాం

మండలంలోని మల్లేపల్లి రోడ్డులో తెగిపోయిన ఈదులవంక కల్వర్టు మరమ్మతు పనులను యుద్ధప్రతిపాదన చేపడుతామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ తెలిపారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలకు ఈ కల్వర్టు తెగిపోవడంతో... 15 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బం దులు పడుతున్న నేపథ్యంలో ఆయన పంచాయతీరాజ్‌ డీఈ శ్రీరాములు, తహసీల్దార్‌ నారాయణస్వామితో కలిసి పరిశీలించారు. వెంటనే కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని, తాను కలెక్టర్‌తో మాట్లాడుతానని శ్రీరామ్‌ అధికారులకు సూచించారు.

GOD:  సామూహిక ఏడు శనివారాల వ్రతం

GOD: సామూహిక ఏడు శనివారాల వ్రతం

పట్టణంలోని శ్రీనివాసనగర్‌ లో వెలసిన లక్ష్మీవెం కటేశ్వరస్వామి ఆలయంలో ఐగో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించా రు. అర్చకులు రాజేశ స్వామివారిని వివిధ పూలు, పట్టువస్ర్తాలు, తులసి ఆకులతో అలంకరించి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మహిళలు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించారు.

DEVOTIONAL: భక్తిశ్రద్ధలతో శ్రావణ పౌర్ణమి

DEVOTIONAL: భక్తిశ్రద్ధలతో శ్రావణ పౌర్ణమి

పట్టణంలోని తేరు బజారులో వెలసి న శ్రీరామభజన మందిరంలో శ్రావణ పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారిని తిరుమంజున సేవను ఘనంగా నిర్వహించారు. గోవింద మాలధా రణ సేవా కమిటీ సభ్యులు దేవతా కృష్ణమూర్తి, కోటి వెంకటేశ్వర్లు, సుఖా నంద ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్ర హాలను ప్రత్యేకంగా అలంకరించి పట్టణంలో ఊరేగించారు.

ROAD: రోడ్డును కప్పేసిన కంపచెట్లు

ROAD: రోడ్డును కప్పేసిన కంపచెట్లు

మండలంలోని గొట్లూరు నుంచి బడన్నపల్లి కి వెళ్లే రహదారి కంపచెట్లుతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. పూర్తిగా కంపచెట్లు రోడ్డు మధ్యలోకి పెరిగిపోవడంతో ద్విచక్రవాహనదారులకు కంపలు గీసుకుని గాయాలవుతున్నాయని తెలుపుతున్నారు.

MLA: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు

MLA: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు

తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద ని, ప్రభుత్వ పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సొసైటీ కార్యాలయం ఆవరణం లో శుక్రవారం సింగల్‌ విండో చైర్మనగా గడ్డం రమణారెడ్డి, డైరెక్టర్లుగా గంగుల ప్పనాయుడు, నాగేనాయక్‌ ప్రమాణం స్వీకారం చేశారు. ముఖ్యఅ తిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హాజర య్యారు.

PROTEST:  ఓటర్ల తొలగింపుపై నిరసన

PROTEST: ఓటర్ల తొలగింపుపై నిరసన

బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీహార్‌లో జరిగిన ఓటర్ల రద్దును నిరసిస్తూ పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

BICYCLES: మూలనపడిన బ్యాటరీ సైకిళ్లు

BICYCLES: మూలనపడిన బ్యాటరీ సైకిళ్లు

ప్రభుత్వం భవిత కేంద్రంలోని దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను సరఫరా చేసింది. వాటిని దివ్యాంగులకు పంపిణీ చేయకుండా మండల కేంద్రంలోని బాలుర ఉన్నతపాఠశాల డైనింగ్‌ హాల్‌లో మూలన పడేశారు. దీంతో అవి ఆ గదిలో పెట్టెలకే పరిమితమయ్యాయి. ఈ సైకిళ్లను ఐదు నెలల క్రితం సరఫరా చేశారు. దీంతో ఒక్కొక్కటి రూ.50 వేలు విలువ చేసే బ్యాటరీ రీచార్జ్‌ సైకిళ్లు మూలనపడి నిరుప యోగంగా మారుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి