Home » Puttaparthi
స్వాతంత్య్రదినోత్స వాలకు మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి జెండా రంగుల విద్యుత దీపా లు వేయించడంతో జెండా పండుగ శోభ సంతరించుకుంది.
కడపజిల్లా పులివెం దుల, ఒంటి మిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంపై తెలుగుతమ్ముళ్లు సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హనుమాన కూడలిల లో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచాకాల్చి మిఠా యిలు తినిపించుకున్నారు.
పట్టణంలోని కాకతీయ, యశోద, రిషి పాఠశాలల్లో, మండలంలోని నాగలూరు వద్ద ఉన్న పీసీఎంఆర్ పాఠశాలలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ముం దస్తుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికలు, కుచేలు డు వేషధారణలో అలరించారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో గురువారం ఆయన జిల్లాలో వినాయక మండపాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత, పంచాయతీ, మున్సిపల్ శాఖాధికారులతో సమీక్షించారు.
ప్రతి ఒక్కరు జాతీయ భావం పెంపొందించుకోవాలని కలెక్టర్ చేతన పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా గురువారం సత్యసాయి సూపర్స్పెషలిటీ ఆసుపత్రి నుంచి వై జంక్షన వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైజంక్షన వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. దేశభక్తి ఉట్టిపడేలా అందరిచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
మేజర్ పంచాయతీలోని పలు కాలనీల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు అస్తవ్యస్తంగా రోడ్లుపైనే పారుతోంది. దీంతో కాలనీల్లోని వీధుల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెడద ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మండలకేంద్రంలోని విజయలక్ష్మీ కాలనీ, అంబేడ్కర్ కాలనీ, నూరుద్దీన కాలనీల్లో ఈ పరిస్థితి నెలకొంది.
స్వమిత్వ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ధర్మవ రం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి జనార్ధనరావు సూచించారు. స్వమి త్వ పథకంలో భాగంగా మండలంలోని పోతులనాగేపల్లిలో క్షేత్రస్థాయి లో జరుగుతున్న సర్వేను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ల సర్వే పూర్తిచేశారు? తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మహమ్మదాబాద్ మిషన కార్యాలయం ఆవరణంలో బుధవారం ఏర్పాటు చేసిన సింగల్విండో అధ్యక్షుడిగా జనసేన నాయకుడు కమ్మల నరేష్, డైరెక్టర్లుగా చంద్రశేఖర్, నరసింహులు ప్రమాణ స్వీకరానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రెం డో రోజు బుధవారం కొనసాగింది. డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎనఎంయూ జిల్లా నాయకులు మోహన, దుర్గాప్రసాద్, నాగప్పమాట్లాడుతూ... ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని, తక్షణమే పీఆర్సీ కమిషనను ఏర్పాటుచేయాలని డిమాండ్చేశారు.
రాష్ట్రస్థాయి బా స్కెట్బాల్ పోటీలకు ధర్మవరం బాల బాలి కలు ఎంపికైనట్లు ఉ మ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోషియేషన సెక్రటరీ శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం ధర్మవరంలో మాట్లా డుతూ... అనంతపురంలోని ఇండోర్స్టేడియంలో గత నెల 20న నిర్వహించిన ఎంపిక పోటీలు నిర్వహించారని తెలిపారు.