Home » Puttaparthi
పట్టణంలో వడ్డె ఓబన్న జయం తి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అ ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నివర్గాల ప్రజలకు మంచిచేయాలనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
పోరాట యోధుడు వడ్డె ఓబన్న అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలను కొత్తచెరువు మండల కేంద్రంలోని వడ్డె ఓబన్న విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాల్గొని వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్థానిక కలెక్టరేట్లో ఆదివారం స్వాతంత్య్ర సరమయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలనుు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర రెడ్డి, వడ్డెర సంఘాల నాయకులు పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలను అధికారు లు, గ్రామ పెద్దలు కలిసి ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. కటారుపల్లిలో చేపట్టిన యోగి వేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైపులు లీకవుతున్నాయి. వాటి వల్ల కొన్నిచోట్ల నీరు కలుషిత మవుతోంది. మరికొన్ని చోట్ల లీకేజీ అయిన నీరు పారి రోడ్లు పా చిపట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీకుల్లో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం తాగునీటి పైపులు లీక్ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.
మండలపరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న నిర్వహించే వేమన జయంతి ఉత్సవాల కు కావల్సిన ఏర్పాట్లను శనివారం ప్రారంభించారు. యోగివేమన ఉత్సవాలను కటారుపల్లిలో అధికారికంగా జరపాలని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ కోరగా ప్రభుత్వం అందుకు స్పందించింది.
తలుపుల మండలపరిధిలోని నిగ్గిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుపై టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. నిగ్గిడి కల్పించాని రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు ఇటీవల విన్న వించారు.
పట్టణంలోని బ్రహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో శనివా రం ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు మూలవిరాట్ను పూలమాలలు, తులసి హా రాలతో ప్రత్యేకంగా అలంక రించారు.
డ్రోన్లతో ఆకతాయిల చేష్టలకు ధర్మవరం టూటౌన పోలీసులు చెక్ పెడుతున్నారు. టూటౌన పరిధి లోని కొత్తపేట సర్కిల్, రైల్వేస్టేషన, కేహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతాలలో ప్రయాణికులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో సంచరి స్తుంటారు. వారిని కామెంట్ చేసే వారిని, అసభ్యంగా ప్రవర్తించే వా రిని పోలీసులు డ్రోన ద్వారా పసిగడుతున్నారు.
రియల్టర్లకు కాసులు వర్షం కురుస్తుందంటే వాగులను కూడా మూసి వేస్తారు. ప్రజల ఎటువంటి సమస్యల పట్టించుకోరనే విమర్శలు మండల ప్రజల నుంచి వినవస్తు న్నాయి. ప్రభుత్వ అనుమతులు ఏ మాత్రం లేకుండా లేఅవు ట్లు వే యడం, ప్రజల నుంచి డబ్బులు దండుకోవ డమే పరిపాటిగా మారుతోంది. దీంతో ప్లాట్లు కొన్నవారు భవిష్య త్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.