Home » Puttaparthi
మండలంలోని చిగిచెర్ల గ్రామంలో సోమవారం పలుదేవతా విగ్రహాల ప్రతిష్ఠను గ్రామపెద్దలు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయ కుడు, నాగదేవతలు, నవగ్రహాలు, ఉమామహేశ్వర విగ్రహాల నుప్రతిష్ఠించారు. వేదపండితుల ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, ప్రా ణప్రతిష్ఠ అనంతరం పుర్ణాహుతి సమర్పించారు.
మండల కేంద్రంలోని సచివాల యం-3లో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, వెల్పేర్అసిస్టెంట్, ఏఎనఎం, మహిళా పోలీసు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు డెప్యుటేషనపై కలెక్టరేట్కు, డీపీఓ కార్యాలయానికి వెళ్లినట్లు సమా చారం. దీంతో వివిధ పనులపై సచివాలయానికి వచ్చే సంబంధిత సిబ్బం ది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంచాయతీ రాజ్ ఉద్యోగుల యూనియన ధర్మవరం తాలుకా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ యూనియన జిల్లా నాయకులు విజయ శేఖర్ నాయుడు, శ్రీని వాసుల తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో ఆదివారం ఆ యూనియన జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్న ట్లు తెలిపారు. తాలూకా అధ్యక్షుడిగా తాడిమర్రి ఎంపీడీఓ కార్యా లయం జూనియర్ అసిస్టెంటు అక్కిం ప్రతాప్ను ఎన్నుకున్నారు.
క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని కల్గిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయం లో మంత్రి ఆదివారం పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా త్వరలో ప్రారంభం కానున్న అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నీ సీజన-2 టీషర్టులను ఆయన ఆవిష్కరించారు.
సమీపంలోని వాగు ప్రవహిస్తే మండల కేంద్రంలోని విద్యుత సబ్స్టేషనలోకి నీరువస్తాయి. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో కదిరి - రాయచోటి రోడ్డు వద్ద వాగు పక్కన విద్యుత సబ్ స్టేషన నిర్మించారు. గతంలో భారీ వర్షా ల కారణంగా సబ్స్టేషనలోకి నీరు చేర డంతో విద్యుత అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పటివరకు సబ్స్టేషనలోకి వాగు నీరు ప్రవహించకుండా ఎలాంటి ప్రహరీ నిర్మించలేదు.
మండలంలోని బడన్న పల్లికి వెళ్లాలంటే ఇప్పటికీ మట్టి రోడ్డే గతి. పైగా ఆ రోడ్డులో గుంతలు ఏర్ప డ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరానికి వెళ్లే రహదారి క్రాస్ నుంచి రైల్వే బ్రిడ్జి కింద వరకు కిలోమీటర్ మేర మట్టిరోడ్డు గుంతలమయం అయింది. దీంతో ప్ర స్తుతం కురుస్తున్న వర్షాలతో నీరంతా ఆ గుంతల్లో నిలిచి మడుగును తలపిస్తోంది. అలాగే రోడ్డుంతా బురదమయం అయింది.
ఆ రోడ్లలో ప్రయాణించా లంటే ఒళ్లు గుల్ల అవుతోంది. అసలే వర్షాకాలం, ఏ గుంత ఎంత లోతు ఉంటుందో తెలియని పరిస్థితి. రోడ్లు వర్షపు నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఎంతలోతు గుంతలున్నాయో తెలియక ద్విచక్రవాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అదుపు తప్పి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి.
స్ర్తీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్ చిత్రపటా లకు క్షీరాభిషేకం చేశారు. మండలకేంద్రంలో శనివారం టీడీపీ మండలాధ్యక్షురాలు సుబాషిణి, నాయకురాలు వాల్మీకి నాగవేణి అధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి, థ్యాక్యూ సీఎం అంటూ నినాదాలుచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశేషకృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పాలేల రామాంజినేయులు పేర్కొన్నారు. సంఘానికి గుర్తింపు వచ్చి ఆరేళ్లు పూర్తిచేసు కున్న సంధర్భంగా జిల్లాకేంద్రంలోని ఆంధ్రప్ర దేశ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం సంఘం జెండాను ఆవిష్కరించి కేక్కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
కృష్ణాష్టమి వేడుకలను శనివా రం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో జగన్నాథ, సుభద్ర, బల రామ ప్రతిమలను ఇస్కాన ధర్మవరం ధర్మప్రచారకులు శ్రీకృష్ణ మాధవ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషధారణలతో అలరించారు.