Home » Puttaparthi
మన సంస్కృతి, సంప్రదాయాల ను భావి తరాలకు అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానం లో బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన సతీసమే తంగా పాల్గొన్నారు.
రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఆర్టీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక కుటాగుల్ల వద్ద ఓబులేశ్వర డిఫెన్స అకాడమీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
మండల పరిధిలోని అడవి బ్రాహ్మణపల్లి తండాలో గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారెమ్మ్ల జాతరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం పల్లకి సేవా కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొ న్నారు.
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో వెల సిన మారెమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మూ లవిరాట్లను ఆలయ పూజారి ఆకుపూజ, వేపమండలు, నిమ్మకాయలతో, వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకం గా అలంకరించి పూజలు చేశారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ సమీపంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 115మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలకు చిలకం మధుసూదనరెడ్డి ఆయన సతీమణి ఛాయాదేవి నగదు బహుమతులు అందజేశారు.
వైసీపీ హయాంలో పల్లెల్లో అభివృద్ధి అటకెక్కింది. రోడ్లు అధ్వానంగా మారాయి. మట్టి రోడ్లే దిక్కయ్యాయి. మండలంలోని చాలా గ్రామాలు.. సీసీ రోడ్లకు నోచుకోలేదు. మట్టి రోడ్లలో గ్రామీణులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలు కూడా లేవు. రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. మట్టిరోడ్ల గుంతల్లో ఆ నీరు నిల్వ ఉంటుండడంతో జనం నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన నాణ్యంగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురష్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కుమ్మవాండ్ల పల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
మండలకేంద్రం నుంచి మండలపరిధి లోని కొండకమర్ల గ్రామం వరకు వెళ్లే క్రాస్లో జాతీయ రహదారిపై (716) నూతనంగా ఫ్లై ఓవర్ను నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డిని కోరారు. బొంతలపల్లి సమీపంలో వెళ్లే గ్రీన ఫీల్డ్ హైవే పరిశీలనకు వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
మండల కేంధ్రం సమీపం లోని ధర్మవరం ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబరు-384లో 273 మందికి గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను పంపిణీచేశారు. ఈ లే అవుట్ ధర్మవరం ప్రధాన రహదారికి సమీపంలో ఉడడంతో ఇక్కడి ఇళ్ల ప్లాట్లకు మంచి డిమాండ్ ఉంది.