Home » Puttaparthi
ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన నాణ్యంగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురష్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కుమ్మవాండ్ల పల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
మండలకేంద్రం నుంచి మండలపరిధి లోని కొండకమర్ల గ్రామం వరకు వెళ్లే క్రాస్లో జాతీయ రహదారిపై (716) నూతనంగా ఫ్లై ఓవర్ను నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డిని కోరారు. బొంతలపల్లి సమీపంలో వెళ్లే గ్రీన ఫీల్డ్ హైవే పరిశీలనకు వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
మండల కేంధ్రం సమీపం లోని ధర్మవరం ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబరు-384లో 273 మందికి గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను పంపిణీచేశారు. ఈ లే అవుట్ ధర్మవరం ప్రధాన రహదారికి సమీపంలో ఉడడంతో ఇక్కడి ఇళ్ల ప్లాట్లకు మంచి డిమాండ్ ఉంది.
పట్టణంలో వడ్డె ఓబన్న జయం తి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అ ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నివర్గాల ప్రజలకు మంచిచేయాలనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
పోరాట యోధుడు వడ్డె ఓబన్న అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలను కొత్తచెరువు మండల కేంద్రంలోని వడ్డె ఓబన్న విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాల్గొని వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్థానిక కలెక్టరేట్లో ఆదివారం స్వాతంత్య్ర సరమయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలనుు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర రెడ్డి, వడ్డెర సంఘాల నాయకులు పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలను అధికారు లు, గ్రామ పెద్దలు కలిసి ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. కటారుపల్లిలో చేపట్టిన యోగి వేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైపులు లీకవుతున్నాయి. వాటి వల్ల కొన్నిచోట్ల నీరు కలుషిత మవుతోంది. మరికొన్ని చోట్ల లీకేజీ అయిన నీరు పారి రోడ్లు పా చిపట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీకుల్లో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం తాగునీటి పైపులు లీక్ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.
మండలపరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న నిర్వహించే వేమన జయంతి ఉత్సవాల కు కావల్సిన ఏర్పాట్లను శనివారం ప్రారంభించారు. యోగివేమన ఉత్సవాలను కటారుపల్లిలో అధికారికంగా జరపాలని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ కోరగా ప్రభుత్వం అందుకు స్పందించింది.