Home » Puttaparthi
మండల కేంద్రంలో ప్రబోధానంద సేవా సమితి, త్రైత సిద్ధాంతం సభ్యుల ఆఽధ్వర్యం శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్ షెల్టర్లో శ్రీకృ ష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 16న కృష్ణుడి ప్రతిమను ఏర్పాటు చేసి నాలుగు రోజులు ప్రత్యేక పూజలు చేశారు. ఐదో రోజు బుధ వారం శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వ హించారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని డీఎస్పీ హేమంతకుమార్ పేర్కొ న్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ జన్మ దినం సందర్భంగా బుధవారం ఆర్డీటీ స్థానిక క్రీడామైదానంలో అ టల్ బిహారీ వాజ్పేయి స్మారక సీజన-2 క్రికెట్ టోర్నీని ప్రారంభిం చారు.
మండలపరిధిలోని నిలువురాతి పల్లిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠను బుధవా రం ఘనంగా నిర్వ హించారు. గ్రామస్థు లంతా కలిసి రూ. కోటి వ్యయంతో గ్రా మంలో నూతనంగా రామాలయం నిర్మించారు. ప్రధాన పౌరోహి తులు మునికోటి కోదండపాణి శర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా 15 మంది వేద పండితులు గణపతి పూజ, కలశస్థాపన, హోమా లు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేద్దామని మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, వయో జన విద్యాశాఖ నోడల్ అధికారి జనార్దన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులను చదువరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ అక్షరాం ధ్ర కార్యక్రమంపై బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సద స్సు నిర్వహించారు.
తమ గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని మండలం లోని పలు గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మ ల్లాకాల్వ, దర్శినమల, ఓబుళనాయునిపల్లి, నేలకోట, ఏలుకుంట్ల తదితర గ్రామాల నుంచి ధర్మవరానికి వెళ్లే రహదారి చాలా ఆధ్వానంగా తయా రైంది.
ఎన్నోఏళ్లుగా పింఛన్లు పొందుతున్నామని, అన్ని అర్హతలు ఉన్న తమకు ప్రస్తుత వెరిఫికేషనలో నిలిపి వేశారని పలువురు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పింఛ న్లు పునరుద్ధరించాలని కోరారు. ఈ మేర కు వారు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఫించన్లు రాకుంటే తాము ఇబ్బం దులు పడాల్సి వస్తుందని వాపోయారు.
పట్టు ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేద్దామని అనంతపురం ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య తెలిపారు. మండలంలోని రేగాటిపల్లిలో మంగళవారం ‘నా పట్టు-నా అభిమానం’ అనే ప్ర చార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లా జా యింట్ డైరెక్టర్ శోభారాణి, ఏడీ అప్పలనాయుడు హాజరయ్యారు.
‘నాడు - నేడు’ పథకం కింద ఎంపికైన కొన్ని ప్రభుత్వ పాఠ శాలల్లో చేపట్టే పనులకు నిధులున్నా, నేటికీ సౌకర్యాలు కల్పించడం లేదు. మండల వ్యాప్తంగా 58 ప్రభుత్వ పా ఠశాలలు ఉన్నాయి. 46 ప్రాథమిక, ఏడో ప్రాథమికోన్న త, నాలుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, కేజీబీ వీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మా ర్చి కార్పొరేటు పాఠశాలలకు దీటు గా తీర్చిదిద్దుతామని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో నిధులు ఇ వ్వకపోవడంలో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిం చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యకుమార్ సతిమణి త్రివేణి పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్యాదవ్ చొరవతో సం స్కృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో, హిందూస్థాన కోకాకోలా బేవరేజేస్ కార్పెరేట్ సంస్థ సహకాంతో సీఎస్ఆర్ నిధుల ద్వారా పలు పా ఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన టాయిలెట్లను ఆమె సోమవారం ప్రారంభించారు.
మండల కేంద్రంలోని బసవన్న కట్ట వీధి, పెద్దమసీదు ప్రాంతాల్లో 15 రోజుల నుంచి తాగునీరు సరఫరా కాలేదం టూ ఆ ప్రాంత మహిళలు సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ధ ర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.... తమ ప్రాంతానికి 15 రోజలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.