Home » Puttaparthi
అనంతపురంలో ఈనెల 10న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్సిక్స్ సభను వి జయవంతం చేద్దామని సీఎం సభ సమన్వయకర్త, తణుకు ఎమ్మెల్యే రాధా కృష్ణ, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కూటమిపార్టీ నాయకులకు, కార్య కర్తల కు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు మాధవ్ పాల్గొనే సూపర్సిక్స్ - సూపర్హిట్ సభను విజయవం తం చేయడంలో భాగంగా కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులతో ని ర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
కేరళ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన విశిష్టమైన వ్యవసాయ పండుగ ఓనం అని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీ రింగ్ ప్రిన్సి పాల్ బాలకోటేశ్వరి పేర్కొన్నారు. పదిరోజుల పాటు నిర్వహించే ఓనం వేడుకలను జిల్లాకేంద్రంలోని సంస్కృతి స్కూల్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
ప్లాస్టిక్ రహిత మున్సి పాలిటీగా పుట్టపర్తిని మారుద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పిలు పునిచ్చారు. ప్లాస్టిక్ రహిత పుట్టపర్తిగా మారుద్దామని మునిసిపల్ కమి షనర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే గురువారం స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద ఆవి ష్కరించారు.
ప్రాథమిక సహకార సొసైటీ లు రైతులకు వెన్నెముకలాంటివని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొ న్నారు. మండల పరిధిలోని కేశాపురం ప్రాథమిక సహకార సొసైటీ పాల కవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఎ మ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జిల్లాకేంద్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ, వైసీపీ నాయకులు కు మ్మక్కై మరీ చిత్రావతి నదిని గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తు న్నాయి. పట్టణంలోని చిత్రావతినదిలో రాత్రింబగళ్లు ఎక్స్కవేటర్లను పెట్టి మరీ ట్రాక్టర్లకు లోడ్ చేసి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ప్రభు త్వం పేదలకు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది.
తమ సమస్యల పరిస్కారంకోసం వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి వచ్చే ఫిర్యాదుదారుల అర్జీల పట్ల ఎటువంటి అలసత్వం వద్దని, సకాలం లో ప్రజల సమస్యలను పరిస్కరించాలని జాయంట్ కలెక్టర్ అభి షేక్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక లో జేసీ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుం చి 174 ఫిర్యాదులను స్వీకరించారు.
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద మహిళను ఆర్థికవేత్తగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఆశయమని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్కలాం షాదీమహల్ వరకు 900 మంది మహిళలతో కలసి ‘సూ పర్సిక్స్ సూపర్హిట్’ భారీ ర్యాలీ నిర్వహించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్క రించుకుని వినాయక విగ్రహాల చేతిలో ఏర్పాటు చేసిన లడ్డూల వేలం పాటలో పొటీపడి పాల్గొ న్నారు. ఇందులో పట్ణణంలో అత్యధికంగా సాయిసదన వినా యక మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూను పట్టణానికి చెందిన శశికుమార్ అనే యువ కుడు రూ 2,64,000కు దక్కిం చుకున్నాడు,
మండలంలోని తంగేడుకుంట పంచాయతీ మద్దకవారిపల్లిలో వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి వద్ద ఉంచిన లడ్డూ వేలాన్ని గురువారం నిర్వహించారు. ఈ లడ్డూను లారీ డ్రైవర్ల అసోసి యేషన వారు రూ.75వేలకు దక్కించుకున్నారు.
పర్యావరణాన్ని కా పాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. వారు మంగళవారం పట్టణవాసులకు మట్టివినాయక ప్రతిమలను పంపిణీచేశారు.